Television Show Oorvasivo Rakshasivo: స్టార్ మా లో ప్రసారం కానున్న సరికొత్త సీరియల్ ఊర్వశివో రాక్షసీవో, బిగ్ బాస్ 7 త్వరలోనే శుభం కార్డుకు సిద్ధం అవుతుంది అంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 17న జరిగిన తరువాత ఆ మరుసటి రోజు నుండి బిగ్ బాస్ స్థానంలో స్టార్ మా లో కొత్త సీరియల్స్ ప్రసారం అవ్వనున్నాయి. అందులో ఒక సీరియల్ ఊర్వశివో రాక్షసీవో, తాజాగా స్టార్ మా వారు ఇచ్చిన అప్డేట్ అనుసారం డిసెంబర్ 18 నుండి ప్రతి రోజు రాత్రి 10 గంటలకు ఊర్వశివో రాక్షసీవో ప్రసారం అవుతుంది. ఇందులో ప్రధాన పాత్రలో సినిమా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఆంటీతో పాటు ప్రముఖ సీరియల్ యాక్ట్రెస్ అయేషా జీనత్ కనిపించనున్నారు.
ఏక్ హసీనా థీ…ఈ సీరియల్ గురించి వినేవుంటారు ఇది స్టార్ ప్లస్ లో బాగా మంచి పేరు తెచ్చుకున్న హిందీ థ్రిల్లర్ సీరియల్. ఈ ఏక్ హసీనా థీ సీరియల్ తెలుగు రీమేక్ ఊర్వశివో రాక్షసీవో… సంజీనా షేక్ హిందీలో చేసిన పాత్ర ఇప్పుడు తెలుగులో అయేషా జీనత్ చేస్తుంది.
ఈ మధ్యలో అయేషా జీనత్ పాపులారిటీ బాగా పెరుగుతుంది…జీ తమిళ్ లో ప్రసారమైన సత్య అనే సీరియల్ లో లీడ్ రోల్ లో అయేషా జీనత్ మంచి పేరు తెచ్చుకుంది. రెడీ స్టడీ పో అనే రియాలిటీ షో తో బుల్లి తెర కెరీర్ మొదలుపెట్టిన అయేషా ఇప్పుడు ఏకంగా స్టార్ మా సీరియల్లో లీడ్ లో కనిపించబోతుంది, జీవితంలో చాలా ముందుకే వచ్చింది అని చెప్పాలి.
ప్రగతి ఆంటీ ఒక పెద్ద కుటుంబానికి చెందిన ఫిమేల్ విల్లన్ గా ఈ సీరియల్ లో కనిపిస్తుంది, ప్రగతి పాత్రకి బుద్ధి చెప్పాలని కంకణం కట్టుకున్న హీరోయిన్ పాత్రలో అయేషా జీనత్ మనందరిని మాయ చేయడానికి డిసెంబర్ 18 నుండి ప్రతి రోజు రాత్రి 10 గంటలకు స్టార్ మా లో మన ముందుకు రానుంది.
సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షో లో పాల్గొన్న అయేషా జీనత్ ఆ షోలో 2వ స్థానం గెలుచుకుని పాపులారిటీ సంపాదించుకుంది, అయితే ఆ తరువాత బిగ్ బాస్ తమిళ్ సీసన్ 6లో కూడా కంటెస్టెంట్ గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇక్కడ బిగ్ బాస్ షో లో కమల్ హాసన్ తో అయేషా జీనత్ కి గొడవ జరిగినంత పనయ్యింది, కమల్ హాసన్ అడిగిన వాటికి కోపంగా అరుస్తూ సమాధానం ఇచ్చి అప్పట్లే వార్తల్లో పాపులారిటీ తెచ్చుకుంది.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!