Sundaram Master OTT: ప్రస్తుత కాలంలో కామెడీ పాత్రల్లో పోషించే నటీనటులు సైతం హీరో మరియు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇటీవలే వెన్నెల కిషోర్ సైతం 111 మూవీతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా కమెడియన్ వైవా హర్ష కూడా ఇండస్ట్రీకి హీరోగా అరంగేట్రం చేశాడు. తాజాగా వైవా హర్ష నటించిన లేటెస్ట్ మూవీ సుందరం మాస్టర్. కామెడీ సన్నివేశాల మధ్య రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉన్న హర్ష ఈ చిత్రంతో హీరోగా మారాడు. ఈ మూవీ ఫిబ్రవరి 23వ తారీకున థియేటర్లలో రిలీజ్ అయింది. స్టార్ హీరో రవితేజ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్స్ ఉన్నాయి.
ఇక మంచి కథాంశం కూడి ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో వసూళ్లను మాత్రం రా బట్ట లేక పోయింది. ఇక ప్రస్తుతం ఈ చిత్రం ఓటిటిలోకి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. సుందరం మాస్టర్ మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సమస్త ఆహా ప్లాట్ఫారం కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ నేడు అనగా మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ” మాస్టారు.. మాస్టారు మీ మనసులను గెలవడానికి వచ్చేశారు ” అనే ఓ కొటేషన్ ద్వారా ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. థియేటర్లో ఈ మూవీని చాలామంది మిస్సయ్య ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం ఎగ్జామ్స్ జరుగుతుండడంతో పెద్దగా ఎవరు థియేటర్లోకి వెళ్లడం లేదు. తమ పిల్లల భవిష్యత్తు నిరూపించే ఈ రోజుల్లో పెద్దగా ఎవరు సినిమాలకి ఆశ చూపించరు. అదేవిధంగా సినిమా అంటేనే హడావిడి చేసేది యువత. ఇక ఆ యువత నేటి కాలంలో ఫుల్ బిజీగా ఉండడంతో ప్రస్తుతం థియేటర్లో డిమాండ్ తగ్గింది.
ఇక రిలీజ్ అయిన సినిమాలన్ని ఓటీటీలోకి వస్తాయి కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు మరికొందరు. అలా ఈ సినిమా ఓటిటి డేట్ కోసం కూడా పలువురు ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల తరువాత సుందరం మాస్టర్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుంది. ఈ మూవీ కోసం ఆహా కూడా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగానే ప్రమోట్ చేస్తుంది. ఇక ఈ మూవీ ఓటిటి హక్కులు ఈటీవీ విన్ దక్కించుకుందని ఆరంభంలో ప్రచారం జరిగింది. కానీ ఉన్నట్లుండి ఇప్పుడు ఆహా కొనుగోలు చేసిందంటూ షాక్ ఇచ్చారు. ఇక సుందరం మాస్టర్ మూవీ కు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో వైవా హర్ష తో పాటు దివ్య శ్రీ పాద, హర్ష వర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు తదితరులు కీలక పాత్రలు వహించారు.
ఆర్టీ టీం వర్క్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్ కుమార్ ఈ మూవీను నిర్మించారు. ఇక ఓ మారుమూల గ్రామంలోని ప్రజలకు ఇంగ్లీష్ నేర్పించేందుకు వెళ్లే సుందరం మాస్టర్ చుట్టూ ఈ మూవీ యొక్క కథాంశం తిరుగుతుంది. ఇక ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ఈ మూవీ లో ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పుడూ కామెడీ రోల్స్ లో కనిపించే వైవా హర్ష హీరో రోల్ లో కనిపించడంతో తన ఫ్యాన్స్ సైతం ఎంతో హుషారుగా ఉన్నారు. దీంతో ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక అనంతరం మిక్స్డ్ టాక్ రావడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్ట లేకపోయింది. మరి ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫారం లో ఏ విధమైన రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి..!
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!