Prema Entha Madhuram October 31 Episode 1087: ఆర్య కంకణం కట్టే ఆ పెద్ద ఆవిడకి ఇస్తాడు. ఆ కంకణం పెద్దావిడ తీసుకెళ్లి అను కి కడుతుంది. నువ్వు పూజ మొదలు పెట్టమ్మా అక్కడ అన్ని అయిపోయాయా లేదో అడిగేసి వస్తాను అని సుగుణ వెళుతుంది. అనురా కంకణం కట్టుకోవడం అయిపోయింది కదా ఇక పూజ మొదలు పెట్టు అని ఒక పెద్ద ఆవిడ అంటుంది. అన్నయ్య దగ్గరికి వెళ్లి అని సిద్ధమయ్యాయో లేదో అడిగేసి రా అని సుగుణ ఉషా ని పంపిస్తుంది. ఉషా వెళ్లి అన్నయ్య పూజ మొదలయ్యింది గంట తర్వాత భోజనాలు పెడతారు అన్ని పూర్తి అయిపోయినట్టేనా సామాన్లను వచ్చేసాయా అని ఉష అంటుంది. అన్ని వచ్చేసాయి అమ్మ నువ్వు అక్కడికి వెళ్లి పూజ దగ్గర కూర్చో ఇక్కడ నేను చూసుకుంటా అని ఆర్య అంటాడు.
ఉష టి తీసుకొచ్చి అందరికీ తాగమని ఇస్తుంది. అను పూజ మొదలు పెడుతుంది. సుగుణ ఆర్య దగ్గరికి వెళుతుంది. నాయనమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు రా లోపలికి వెళ్దాము అని ఆకాంక్ష అంటుంది. ఏమీ లేదమ్మా పూజ అయిపోగానే భోజనాలు పెట్టాలి కదా అన్ని సమకూర్చి ఉన్నాయా లేదా అని చూస్తున్నాను అని సుగుణ అంటుంది. ఆకాంక్షను చూసిన ఆర్య తన మొహానికి టవల్ కప్పుకొని మనీ ఇక్కడికి పిల్లలు ఎవరు రాకుండా చూసుకో నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని ఆర్య అంటాడు. ఇంతలో అభయ్ వచ్చి పూజ దగ్గరికి నైవేద్యం కావాలంట తీసుకురా అని మని తో అంటాడు. పిల్లలు ఎవరు ఇక్కడికి రాకూడదు నువ్వు ఎందుకు వచ్చావు అని మని అంటాడు . అరే నా ఇంట్లో నన్ను రావద్దు అనడానికి నువ్వు ఎవరు నేను అలాగే వస్తాను కాని నైవేద్యం తీసుకురా అని అభయ్ వెళ్ళిపోతాడు. పిల్లలు ఎవరు ఇక్కడికి రా వద్దని చెప్పాను కదా ఎందుకు రాణించావు మణి అని ఆర్య అంటాడు. వాడు పిల్లవాడు కాదు సార్ పిడుగు లా ఉన్నాడు నన్నే బెదిరించాడు అని మనీ అంటాడు.
సరే నేను నైవేద్యం తీసుకువెళ్లి అక్కడ పెట్టి వస్తాను ఇక్కడ నువ్వు చూసుకో అని ఆర్య నైవేద్యం తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మకి నైవేద్యం ఇస్తాడు.నాన్న పూజ అయిపోవచ్చింది దండం పెట్టుకో అని సుగుణ అంటుంది.అక్క నేను వెళ్లి నైవేద్యం తీసుకు వస్తాను అని ఉష వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న నైవేద్యం తెచ్చి పూజ దగ్గర పెడుతుంది. ఆర్య అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్లిపోతాడు. అను మేము అమ్మవారి 108 నామాలు చదువుతూ ఉంటాము నువ్వు కుంకుమ పూజ చెయ్యమ్మా అని ఆ ముత్తైదువుల్లో ఒక ఆవిడ అంటుంది.అలాగే అక్క అని అను అంటుంది. వాళ్ళు నామాలు చదువుతూ ఉండగా కుంకుమతో అర్చన అమ్మవారికి చేస్తుంది. కట్ చేస్తే జలంధర్ వాళ్లు సుగుణ వాళ్ళ ఇంటికి వచ్చి మీ అమ్మ ఎక్కడికెళ్ళింది పిలువు మీ అమ్మని అని ఛాయా అంటుంది.
మా అమ్మ వాళ్లు ఇంట్లో లేరు తెలిసిన వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే అక్కడికి వెళ్లారు అని జ్యోతి అంటుంది. ఒరేయ్ ఇల్లంతా ఒకసారి వెతకండి రా అని ఛాయా అంటుంది. ఆ రౌడీలు ఇల్లంతా వెతికి అవునమ్మా ఇంట్లో ఎవరూ లేరు అని అంటారు. ఎక్కడ ఉన్నారు చెప్తావా లేదా అని ఛాయా అంటుంది. నేను చెప్పను అసలు మీరు ఎవరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని జ్యోతి అంటుంది. మర్యాదగా వస్తావా లేదంటే చస్తావా అని ఛాయా తనను బెదిరించి కారు ఎక్కించి తీసుకువెళ్తుంది. అను అమ్మ వారి పూజ సంపూర్ణమైంది. తులసి తోటకు కూడా పూజ చేయి పూజ చేసిన తర్వాత వాయినాలు ఇస్తే అయిపోతుంది అని సుగుణ అంటుంది. అను సుగుణ చెప్పినట్టే తులసి తోటకి పువ్వులు వేసి పసుపు కుంకుమ వేసి నీళ్లు పోసి హారతి ఇచ్చి అగరవత్తులు ఇచ్చి పూజ చేస్తుంది. అక్క పూజ అయిపోతుంది అన్ని సిద్ధంగా ఉన్నాయో లేదో చూస్తాను అని ఉషా వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్లి అన్నయ్య పూజ అయిపోయింది వాయినాలు ఇచ్చేస్తారు ఇక వెంటనే భోజనాలు పెట్టాలి కానీ పెరుగు మాత్రం మర్చిపోయావు అన్నయ్య నువు వెళ్లి షాప్ లో నుంచి తీసుకొస్తావా అని ఉషా అంటుంది.
మనీ ఇక్కడికి ఎవరు రాకుండా చూసుకో నేను వెంటనే వెళ్లి పెరుగు తీసుకొస్తాను అని ఆర్య వెళ్ళిపోతాడు.అను పూజ పూర్తి అయిపోయి అందరికీ వాయినాలు ఇస్తూ ఉండగా. జ్యోతి ఛాయా వాళ్ళను తీసుకువచ్చి ఇక్కడే పూజ జరుగుతుంది అని అంటుంది. ఈ ఇల్లు అను వాళ్ళ ఇల్లు కదా అని మానస అంటుంది. ఎటు నుంచి ఎటు వెళ్లిన మనకు శత్రువుల తోటే ముడిపడి ఉంటుంది ఏం చేస్తాం తప్పదు కదా ల్యాండ్ కావాలంటే వెళ్లాల్సిందే అని ఛాయా లోపలికి వెళుతుంది. అమ్మ ఇక్కడికి ఇంకా ఇద్దరు ఎవరో వచ్చారు వాళ్ళ కూడా వాయనం ఇవ్వమ్మా అని సుగుణ అంటుంది. అలాగే అని అను వెనకకు తిరిగి చూసేసరికి ఛాయా మానస కనపడతారు వారిని చూసి అను షాక్ అవుతుంది. ఆవిడతో కలిసి పూజలు చేసుకున్నది చాలు సుగుణ మాతో బయలుదేరి రా అని ఛాయా అంటుంది. అసలు ఎవరు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు నాతో ఏం పని అని సుగుణ అంటుంది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వీళ్లతో ఏం పని అని అను అంటుంది. అదేనండి మా ఐదేకుల సైట్ కోసం గొడవ పడుతున్నార ని చెప్పానే వాళ్లే వీళ్లు అని ఉష అంటుంది.
అసలు మీరు మనుషులేనా డబ్బు కోసం ఏమైనా చేస్తారా అని అను వాళ్ళని అంటుంది. నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోకు అని మానస అంటుంది. ఏ సుగుణమ్మ వస్తావా అని దౌర్జన్యంగా అంటుంది ఛాయా. ఏంటండీ దౌర్జన్యం చేస్తున్నారు అని దివ్య అంటుంది. దౌర్జన్యం అంటే ఇదమ్మా అని జలంధర్ జ్యోతిని చేతిలో పట్టుకొని తుపాకీ తన తలకు పెట్టి చూడు మాతో వస్తావా లేదా అని అంటాడు. ఏంటి చంపుతానని బెదిరిస్తే మేము సంతకం పెడతాము అనుకుంటున్నావా అని ఉషా అంటుంది. సుగుణమ్మ గారు ఇప్పుడు ఏం చేస్తారు మీరే ఆలోచించుకోండి మీకు భూమి కావాలంటే కుటుంబాన్ని వదులుకోవాలి కుటుంబం కావాలంటే భూమిని వదులుకోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మీకు దక్కుతుంది చెప్పండి లేదంటే మీ అమ్మాయి తల పగిలిపోతుంది అని జలంధర్ బెదిరిస్తాడు.
ఏంటి అసలు మీరు మనుషులేనా మానవత్వం అనేది మీకు లేదా మీకు ఉన్నదానితో సరిపెట్టుకోక వేరే వాళ్ళది కూడా బలవంతంగా లాక్కుంటారా ఏంటి దౌర్జన్యం అని అను అంటుంది. నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోకు వీళ్ళకి తోడుగా నీ పిల్లల్ని కూడా బెదిరించమంటావా అను ఛాయా అంటుంది. చూడు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నువ్వు మా జోలికి రానంతవరకు నేను మీ జోలికి రాను లేదంటే కష్టాలను కొని తెచ్చుకుంటావు అని జలంధర్ అంటాడు. బాబు ఇప్పుడిప్పుడే మా కుటుంబం సంతోషంతో ఉంటుంది ఈ మధ్యనే మా అబ్బాయి వచ్చాడని మేము చాలా ఆనందంగా ఉన్నాము ఇప్పుడు ఆ స్థలం కోసం నా కుటుంబాన్ని పోగొట్టుకోలేను మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను బాబు నా కూతురు మాత్రం ఏమీ చేయకు అని సుగుణ జలంధర్ కాళ్ళ మీద పడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!