Nindu Noorella Saavasam October 31 Episode 68: ఏం చేస్తున్నారండి అని భాగమతి కళ్ళు తెరిచి అంటుంది. అవును నువ్వు నీళ్లలో ఎందుకు పడిపోయావు అని అమరేంద్ర అంటాడు. అంజు పాపా నీళ్లలో మునిగిపోతుంటే కాపాడదామని వెళ్లాను అని భాగమతి అంటుంది. పిల్లలందరికీ స్విమ్మింగ్ వచ్చు నువ్వు ఎందుకు అందులోకి వెళ్లావు అని అమరేంద్ర అంటాడు. అవునా అంటే కావాలనే నన్ను నీళ్లలోకి దింపాలని ప్లాన్ చేశారా అని భాగమతి అనుకుంటుంది. చెల్లి నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నీకేం కాలేదు కదా అని కంగారుగా అరుంధతి అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను అక్క కానీ ఆయన ఏంటి ఇలా చేయబోయాడు అసలు నేను ఆయన అలా చేస్తాడని అనుకోలేదు అని భాగమతి అంటుంది. అలా ఎందుకు చేస్తాడనుకున్నావు చెల్లి నువ్వు కళ్ళు తెరవక పోయేసరికి తను కంగారు పడి నోట్లో నోరు పెట్టి గాలి ఊదామనుకున్నాడు అంతేకానీ తప్పుడు ఉద్దేశంతో కాదు అని అరుంధతి అంటుంది.
మీ ఆయన ఏమంటున్నావు అక్క అని భాగమతి అంటుంది. అంటే ఆయన మా ఆయన మా ఆయన కాదు కానీ ఆయన అలాంటి పనులు ఎప్పుడు చేయడు తను డిసిప్లేన్ కి మారుపేరు ఆడవాళ్ళని చాలా గౌరవిస్తాడు అని అరుంధతి అంటుంది. రాథోడ్ నీలాని హాస్పటల్లో జాయిన్ చేయించు మనం అందరం ఇంటికి వెళ్దాము అని అమరేంద్ర అంటాడు.కట్ చేస్తే అందరూ పిక్నిక్ నుంచి ఇంటికి వస్తారు. వాళ్ల వెనకాలే భాగమతి వాళ్ళ మామయ్య కూడా వచ్చి అమరేంద్ర కి డౌట్ వచ్చేలా అక్కడ నిలబడతాడు. అమరేంద్ర తనని చూసి ఆగు అని అనేలోపు అతను బయటికి పరిగెత్తాడు. అతను వెళ్ళిపోగానే భాగమతి దగ్గరికి వచ్చి అతను ఎవరో నీకు తెలుసా ఎందుకు నీ వెనకాల వస్తున్నాడు ఇందాక పిక్నిక్ దగ్గర కూడా నీతో మాట్లాడాడు ఇప్పుడు ఇంటిదాకా వచ్చాడు అసలు ఎవరు అతను అతనికి నీకు సంబంధం ఏంటి అని అమరేంద్ర భాగమతిని అడుగుతాడు. ఏమో నాకేం తెలుసండి అసలు అతని నేను చూడనే లేదు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని భాగమతి అంటుంది.
సరే పదండి అందరూ లోపలికి వెళ్దాము రాథోడ్ ఈ సామాన్లన్నీ లోపల పెట్టించు అని అమరేంద్ర లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అందరూ ఇంటికి వచ్చేసారు ఆ నిండుకుండ రత్తడు నన్ను చూస్తే పిక్నిక్ లో నన్ను ఎందుకు కొట్టావు అని నిలదీస్తాడు అప్పుడు నేను ఏమి చెప్పాలి అని గుప్తా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అరుంధతి వచ్చి గుప్తా గారు ఈ మిస్సమ్మ ఎక్కడ చూస్తుందో నాని దాక్కోలేక చస్తున్నానండి తను త్వరగా పడుకుంటే స్వేచ్ఛగా తిరుగుచు ఏదో ఒకటి చేయండి గుప్తా అని అరుంధతి అంటుంది. ఏంటి చేసేది బాలిక నా ఉంగరం పోయి నేను నాన్న అగచాట్లు పడుతున్నాను నీవు అక్కడికి వెళ్లి వచ్చేటప్పుడు నీతో పాటు అన్ని తీసుకువచ్చావా ఇంకేమైనా పోగొట్టుకొని వచ్చావా అని గుప్తా అంటాడు. ఏంటి గుప్తా గారు ఉంగరం గురించి మాట్లాడుతున్నారు అంటే నేనే తీశాను అని అనుమానo పడుతున్నారా ఇక్కడ ఉండి ఇవన్నీ చూడలేక చస్తున్నాను త్వరగా నీ ఉంగరం వెతుక్కోండి మీ లోకానికి వెళ్ళిపోదామని అరుంధతి అంటుంది. నా ఉంగరం దొంగిలించినదే కాక నన్నే నీ ఉంగరం వెతుక్కొని రా నీ లోకానికి పోదామని నన్నే బెదిరించుచుంటివా బాలిక అయినను నువ్వు మంచి దానివి అని నీకు సహాయం చేయుటయే నేను చేసిన తప్పిదము ఇప్పుడు ఆ నిండుకుండ రతడు కనిపిస్తాడు ఏమి చేయవలెను అని గుప్తా అనుకుంటాడు.
ఇంతలో రాథోడ్ వచ్చి ఒరేయ్ నిన్ను పని చేయమని చెప్తే నువ్వు మాతో పిక్నిక్ ఎందుకురా వచ్చావు అని అంటాడు. నేను మీతో వచ్చానని మీరు భ్రమ పడుతున్నారా చూడండి ఇక్కడ ఉండి నేను ఈ చెట్లకు నీళ్లు పెడితినే పువ్వులు కోస్తిని అన్ని పనులు చక చక చేసుకుని మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను కానీ మీరు నన్ను అనుమానిస్తున్నారా దీనికి నేను ఒప్పుకోను అని గుప్తా అంటాడు. నీవు అచ్చటకు వచ్చినది బ్రమ అయితే ఈ దెబ్బలు ఎలా తగులుతాయి నొప్పులు ఎలా ఉంటాయి అని రాథోడ్ అంటాడు. అన్నము పెట్టిన మీకు నేను ద్రోహం చేస్తానా అని గుప్తా అంటాడు. ఏమోరా బ్రమ లో కూడా నన్ను కొట్టినట్టు అనిపిస్తుంది ఇదంతా నిజంగానే బ్రమ అంటావా అని రాథోడ్ అంటాడు. చూడండి బ్రమలో కూడా నిన్ను నేను ఎందుకు కొడతానండి అయినా వెళ్ళిన వారు అందరూ క్షేమంగా వచ్చినారా అని గుప్తా అంటాడు.
అందరం వచ్చినట్టే కానీ నీలా మాత్రం కాలు విరగొట్టుకొని హాస్పిటల్లో పడింది రా అని రాథోడ్ అంటాడు. ఆ మాట వినగానే గుప్తా కి గుండెలు బద్దలైపోయినంత పని అవుతుంది. కట్ చేస్తే ఏంటమ్మా గారు మీరు ఆ మిస్సమ్మని ఏదో చేద్దాం అనుకుంటే నాకాలు చెయ్యి విరిగిపోయింది ఇక నేను పనిచేస్తానంటావా అని నీలా అంటుంది. నీ పిచ్చి పనుల వల్ల ఇలా మిస్ అయిపోయా మిస్సమ్మ బతికిపోయింది లేదంటే హాస్పిటల్ లో అది ఉండాల్సింది నీ ఖర్మ కాళీ నువ్వు ఇలా హాస్పిటల్ లో పడ్డావు అని మనోహరి అంటుంది. డాక్టర్ గారు నాకు ఏమైంది నేను ఇంటికి వెళ్లొచ్చా అని నీలా అడుగుతుంది. మీకు పెద్దగా దెబ్బలు ఏమి తగల్లేదు కానీ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్ అంటుంది. దీనికి డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాను దీనికి మళ్ళీ సేవలు చేయాలా డిశ్చార్జ్ చేసి డిక్కీలో పడేయండి ఇంటి దగ్గర చూసుకుంటాను అని మనోహరి వెళ్ళిపోతుంది.నర్స్ ఈవిడని డిశ్చార్జ్ చేసి కార్లో కూర్చోబెట్టండి ఇంటికి వెళుతుందట అని డాక్టర్ గారు చెప్తారు. కట్ చేస్తే నా బుజ్జి కదూ నా తల్లి కదు స్కూల్కు లేట్ అవుతుందా అమ్మ ఈరోజు మొదటి రోజు కదా లే తొందరగా వెళ్లి రెడీ అవ్వు అని అరుంధతి అంజుని లేపుతుంది.
అమ్మ టైమెంతయింది ఇంకా కొద్దిసేపు పడుకోవచ్చా లేసి రెడీ అవ్వాలా అని చేయి పెట్టి అమ్ముల్ని వెతుకుతూ అంజలి అంటుంది. చేయికి తగలబోయే సరికి వీళ్ళు ఏం చేస్తున్నారు అని లేచి చూసేసరికి వాళ్ళు ముగ్గురు చదువుకుంటూ కనిపిస్తారు. ఏంటి నేను చూస్తున్నదంతా నిజమేనా వీళ్ళకి చదువు దయ్యం కాని పట్టిందా అని అంజు అక్క ఏంటి ఇంత పొద్దున్నే లేచి రెడీ అయ్యి చదువుకుంటున్నారు అని అడుగుతుంది. ఈరోజు కొత్త స్కూల్లో అడ్మిషన్ అవుతున్నాం కదా అక్కడ ఎగ్జామ్ పెడతారు ప్రిపేర్ అవ్వాలి కదా అని అమృత అంటుంది. కొత్త స్కూల్లో ఎగ్జామ్ పెడతారా అని అంజు అంటుంది. అంజు ఆ స్కూల్లో ప్రిన్సిపాల్ ఎవరో నీకు తెలుసా కొడైకెనాల్లో నిన్ను టార్చర్ పెట్టిన ప్రిన్సిపాల్ ముందే ఆవిడ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందట అని అమృత అంటుంది.
మీరు ఆ కొత్త స్కూల్ కి వెళ్ళండి నేను మాత్రం పాత స్కూల్ కి వెళ్తాను అని అంజలి అంటుంది. ఎందుకు అలా నాన్నగారు ఒప్పుకుంటారా నువ్వు రావాల్సిందే అని ఆకాష్ అంటాడు. నేను వచ్చినా ఆ ప్రిన్సిపాల్ నన్ను జాయిన్ చేసుకోదు నేను రావడం దండగ అని అంజు అంటుంది.నువ్వు రానని అన్నా డాడీ ఊరుకోరు కదా అయ్యో పాపం అంజలి ఇప్పుడు ఏం చేస్తావు ఆ ప్రిన్సిపాల్తో ఏ గలేక నువ్వు ప్రతిరోజు చావాల్సిందే నీకు టార్చర్ ఉంది అని అమ్ము అంటుంది. అందుకే అక్క నేను స్కూల్ కి రానంటున్నాను మీరు వెళ్ళండి అని అంజు అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!