Keerthy Suresh: అగ్ర దర్శకుడు శంకర్ ఇంట ఇటీవల పెళ్లి భాజాలు మోగిన సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య రెండోసారి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. శంకర్ వద్ద గత కొంతకాలం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్ తో ఆమె ఏడడుగులు వేసింది. చెన్నైలో సోమవారం నాడు వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో ప్రముఖులు తరలి వచ్చారు. నూతన జంటను ఆశీర్వదించారు. ఐశ్వర్య-కార్తికేయ వివాహానికి హాజరైన సినీ ప్రముఖుల్లో మహానటి కీర్తి సురేష్ కూడా ఒకటి.
డిజైనర్ శారీలో ఎంతో అందంగా ముస్తాబై పెళ్లిలో సందడి చేసింది. తన గ్లామర్ తో కీర్తి సురేష్ అందరిని అట్రాక్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆల్రెడీ చెక్కర్లు కొట్టాయి. అయితే శంకర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ కట్టుకున్న చీర ఖరీదు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన చీరను కీర్తి సురేష్ కట్టుకుంది. కీర్తి లుక్ ను చాగా గ్రాండ్ గా మార్చిన ఆ చీర ఖరీదెంతో తెలుసా.. అక్షరాల రూ. 2,99,900. అంటే దాదాపుగా మూడు లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు కళ్లు తేలేస్తున్నారు. ఒక్క చీర కోసం కీర్తి సురేష్ అంత ఖర్చు పెట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీయిన్గా నిలదొక్కుకుంది. 2017లో ఇదు ఎన్న మాయం మూవీతో తమిళంలోకి, 2016లో నేను శైలజ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. తనదైన అందం, అభినయంతో వరుస ఆఫర్లు అందుకుంది. అనతి కాలంలోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఏడాదికి నాలుగైదు చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది.
ఇటీవల సైరన్ మూవీ తో కీర్తి సురేష్ థియేటర్స్ లో సందడి చేసింది. జయం రవి హీరోగా ఆంటోనీ భాగ్యరాజ్ రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఓటీటీలో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో రఘులత, రివాల్వర్ రేటా, కన్నివేది అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో తన డెబ్యూ మూవీకి సైన్ చేసింది. అదే బేబీ జాన్. తమిళ బ్లాక్ బస్టర్ హిట్ తేరి మూవీకి హిందీ రీమేక్ ఇది. కలీస్ రచన మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. తేరి డైరెక్టర్ అట్లీ కుమార్ ఈ మూవీకి సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న బేబీ జాన్ మూడీ ఈ ఏడాది మే 31న విడుదల కాబోతోంది.
ఇక తెలుగులో మాత్రం కీర్తి సురేష్ కు సినిమాలు లేవు. గత ఏడాది దసరా చిత్రంతో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత భోళా శంకర్ లో చిరంజీవికి చెల్లెలుగా కనిపించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. భోళా శంకర్ అనంతరం తెలుగులో కీర్తి సురేష్ మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు. ఇప్పటికైతే ఈ అమ్మడి ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!