Vyooham Shapatham: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వ్యూహం, శపథం అనే సినిమాలు తీయడం తెలిసిందే. వైయస్ జగన్ రాజకీయ కెరియర్ లో జరిగిన అనేక సంఘటల ఆధారంగా ఈ సినిమాలను చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు ముందే ఈ సినిమాలు విడుదల చేయాలని ఆర్జీవి ప్లాన్ చేసి..”వ్యూహం” ముందు విడుదల చేయాలని భావించారు. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ నెలలో విడుదల కావలసిన ఈ సినిమాని న్యాయస్థానాలలో నారా లోకేష్ అడ్డుకోవడం జరిగింది.
వైయస్ జగన్ కి రాజకీయ లబ్ధి చేకూర్చటానికి ఆర్జీవి తమనీ నెగటివ్ చేస్తున్నట్లు సినిమాలో పాత్రలు కూడా వాస్తవానికి తగ్గట్లు ఉన్నాయని పిటిషన్ వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలలో అనేక పోరాటాలు చేసిన ఆర్జీవి..వ్యూహం, శపథం రెండు సినిమాలు విడుదల అయ్యేలా చక్రం తిప్పారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ పార్టీ పెట్టడం, సీఎం కావడం వంటి ఘటనలను ఇందులో చూపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్రలు ఉన్నాయి. ‘వ్యూహం’ సినిమా ఈ నెల 23న.. రెండో పార్ట్ ‘శపథం’ మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ట్రైలర్లు విడుదల చేసి స్పష్టం చేశారు.
ఇప్పటికే వైయస్ జగన్ కి సంబంధించి విడుదలైన “యాత్ర 2” వైసీపీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. మహీ వి రాఘవ్ తర్కెక్కించిన విధానం సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడం జరిగింది. ఫిబ్రవరి 8వ తారీకు విడుదలైన యాత్ర సెకండ్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని కైవాసం చేసుకుంది. గతంలో యాత్ర సినిమా విజయం సాధించగా ఇప్పుడు దానికి తగ్గట్టుగానే సెకండ్ పార్ట్ కూడా హిట్ అయింది. ఇప్పుడు వ్యూహం, శపథం విడుదలవుతున్న క్రమంలో వైసీపీ అభిమానులు ఎంతో ఆసక్తిగా సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!