Shruti Haasan: ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ అనారోగ్యంతో హాస్పటల్ పాలైంది. ఈ వార్తే గత కొద్ది రోజుల నుండీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బెడ్పై క్రిటికల్ పోజిషన్లో ఉందంటూ కూడా ప్రచారం జరిగింది. దీంతో ఆమె అభిమానులు పడుతున్నారు. అయితే దీనిపై తాజాగా శ్రుతి హాసన్ స్పందిస్తూ.. ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
`నా ఆరోగ్యంపై వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను చాలా బాగున్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్లో బిజీగా ఉన్నాను. నా డైలీ రోటీన్స్, రెగ్యులర్ షూటింగ్స్తో బిజీగా ఉన్నాను. నాకు ఉంది పీసీఓడి(PCOD) సమస్య ఒక్కటే. అది మహిళల్లో ఉండే సాధారణ సమస్య. దానికే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటీవల నేను పెట్టిన పోస్ట్ను కొంతమంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నేను ఎంతో ఆరోగ్యం ఉన్నాను` అని చెబుతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియో షేర్ చేసింది. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవం అని తేలిపోయింది. కాగా, శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె నటసింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `ఎన్బీకే 107`లో నటిస్తోంది.
అలాగే మెగా స్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న `మెగా 154`లో హీరోయిన్గా ఎంపిక అయింది. వీటితో పాటు ప్రభాస్ సరసన `సలార్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నటిస్తోంది. ఈ మూవీకి `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!