Rashmi: నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.గీత గోవిందం వంటి సినిమాలతో మంచి సక్సెస్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇక రష్మిక చలో సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా అనంతరం ఈమె నటించిన అనేక సినిమాలు మంచి సక్సెస్ పొందాయి.
ఇక ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రష్మిక మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇటు టాలీవుడ్ తో పాటు మరోపక్క బాలీవుడ్ లో కూడా మంచి పేరును దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె లైన్ అప్ లో ఉన్న సినిమా ” పుష్ప 2 “. ఇక ఇదిలా ఉంటే ఈమె 2022లో శర్వానంద్ సరసన ” ఆడవాళ్లు మీకు జోహార్లు ” సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
అదేవిధంగా ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఆమెపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఇక దీనిపై రష్మిక తాజాగా ఓ ట్వీట్ చేసింది. అనేక ఇంటర్వ్యూలలో తాను పాల్గొన్న ఎప్పుడు ఆ సినిమా గురించి నెగటివ్ వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించింది. కానీ రీసెంట్ గా ఒక అభిమాని చేసిన కామెంట్ కు రష్మిక తీవ్రంగా మండిపడింది. స్క్రిప్ట్ నచ్చకపోయినప్పటికీ శర్వానంద్ కోసమే ఈ మూవీ చేసినట్లు వెల్లడించింది.