Trinayani April 9 2024 Episode 1208: ఆడవాళ్లను అవమానిస్తే వాళ్ల కాళ్ల దగ్గర పడాల్సి వస్తుందని ఇప్పటికైనా అర్థమైందా అని విశాలాక్షి అంటుంది. లేవండి బావగారు అని నైని అంటుంది. ఇప్పుడు ఆయన ఒంట్లో ఏ అంగము పనిచేయదు అని హాసిని అంటుంది. పెద్ద మనిషివి అయ్యావా అని అడిగావు ఆడవాళ్ళని అర్థం చేసుకొని ఉంటే ఈ మాట అడగవు నీ కన్నతల్లి రక్తంతో నీ జననం అయ్యింది మళ్లీ నీ చావు కూడా రక్తంతోటే ముగుస్తుంది ఇంకెప్పుడూ ఇలా ఆడవాళ్ళని హీనంగా మాట్లాడకు అని విశాలాక్షి అంటుంది. నీ మాటలు మంచిగా అర్థం చేసుకుంటే భయంతో చేస్తాడు అని నైని అంటుంది. బాగా బుద్ధి వచ్చిందా అని హాసిని తనని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బావగారు అది ఫైల్ నుంచి పడిన పేపర్ ఇటు ఇవ్వండి అని నైని అంటుంది. ఇదేంటి 12 కోట్లు విత్ డ్రా చేసినట్టు ఉంది అని వల్లభ పేపర్ ని అనుమానంగా చూస్తాడు. ఏంటి పుత్ర అలా అనుమానంగా చూస్తున్నావ్ అని డమ్మక్క అంటుంది.
వైస్ అయిపోతుంది కదా అక్షరాలు కనపడట్లేదేమో అని హాసిని అంటుంది. ఆ పేపర్ ని త్వరగా తీసుకోండి అని డమ్మక్క అంటుంది. అన్నయ్య ఆ పేపర్ ఇవ్వు అని విశాల్ అంటాడు. అందులో ఏముంది అల్లుడు అని పావన మూర్తి అంటాడు. గాయత్రి పెద్దమ్మ గురించి ఉంది అని వల్లభ అంటాడు. ఇందులో పోయిన నెలలో 12 కోట్లు విత్డ్రా అయ్యాయి ఏమైనా టు అని వల్లభ అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు బావగారు ఆ పేపర్ ఇట్ ఇవ్వండి అని నైని అంటుంది. అన్నయ్య బిజినెస్ అన్నాక విత్డ్రాలు ఉంటాయి వేడలు ఉంటాయి అవన్నీ నీకెందుకు అని విశాల్ అంటాడు. ఇస్తా నాగు తమ్ముడు ఇందులో గాయత్రీ పెద్దమ్మ పేరు మీద 12 కోట్లు విత్ డ్రా అయినట్టు ఉన్నాయి అవి ఎవరు తీసినట్టు అని వల్లభ అంటాడు. దాంట్లో ఆశ్చర్యపడడానికి ఏముంది శ్రీవారు గాయత్రీ పేరుమీద డబ్బులు డ్రా చేయాలంటే విశాల్ షూరిటీ సంతకం పెట్టి ఉంటాడు అని హాసిని అంటుంది. ఇవి పోయిన నెలలో విత్ డ్రా అయ్యాయి అప్పటికి పేరు మార్చలేదు కదా అని వల్లభ అంటాడు.
అంటే నెల ముందే గాయత్రి పాప పేరు గాయత్రీ దేవి అని పెట్టేశావా అల్లుడు అని పావన మూర్తి అంటాడు.నేను పెట్టడమేంటి మామయ్య అని విశాల్ అంటాడు. అరే గాయత్రీ దేవి పేరు మీద ఎకౌంటు ఎప్పుడో ఓపెన్ చేశాడని నీకు కూడా చెప్పాడు కదా చెల్లి అప్పటినుంచి కదా ముందుకు వెళ్తున్నాడు విశాల్ అని హాసిని అంటుంది. అవును వదిన అని విశాల్ అంటాడు. ఇటీవ్వు అని ఆ పేపర్ తీసుకొని ఫైల్ లో పెట్టి విశాల్ కి ఇస్తుంది హాసిని. కట్ చేస్తే, బ్యాంకులో గాయత్రి పాప పేరు మీద గాయత్రి దేవిగా ఎందుకు మచ్చారు అని నైని అడుగుతుంది. పెద్దమ్మ పెట్టిన పేరుని బ్యాంకులో మార్పు చేయాలని చెప్పాను కదా అందుకే అమ్మ పేరు మీద నెల ముందే డబ్బులు డ్రా చేశాను నీకు కూడా చెప్పాను కదా అని విశాల్ అంటాడు. మీరు నాకు చెప్పలేదు అని నైని అంటుంది. మర్చిపోయి ఉంటాను అని విశాల్ అంటాడు. ఇప్పుడే కదా బాబు గారు అన్నారు అప్పుడే ఎలా మర్చిపోతారు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి అని నైని అంటుంది.
నీ కళ్ళల్లోకి చూసి సాయంత్రం పూట మాట్లాడలేకపోతున్నాను నాకు పాలు కావాలి అని విశాల్ అంటాడు. కావాలంటే నేను హాసిని అక్క నైట్ అంతా కూర్చొని నీకు ఏదైనా చేసి పెడతాము నేను ఏదో మాట్లాడుతుంటే మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు అవన్నీ పక్కన పెట్టండి మీరు నేను అడిగినదానికి సమాధానం చెప్పండి అని నైని అంటుంది. థాంక్స్ నైని అని విశాల్ అంటాడు. థాంక్స్ లేమి వద్దు అని నైని అంటుంది. అయితే సెకండ్ ఇస్తాను అని చేయి చాపుతాడు విశాల్. ఆ చేతిలో పేపర్ పెడుతుంది నైని. ఇదేంటి నైని అని విశాల్ అంటాడు. గాయత్రి పాపకి గాయత్రి అమ్మగారు పుట్టినరోజు ఉన్నాడు పేరు పెట్టారు. ఎందుకని అమ్మగారు పుట్టిన రోజు పేరు పెట్టారు సరే పుట్టిన తేదీని కూడా ఎందుకు మార్చారు అని నైని అడుగుతుంది. అమ్మ పుట్టిన తేదీని మార్చాను ఎలాగూ సంవత్సరాన్ని మార్చలేను ఈ పేపర్ ఫైల్లో కదా పెట్టాలి ఇలా పడేస్తే ఎలా అంటూ విశాల్ వెళ్ళిపోతాడు. గాయత్రి పాపది మహార్ జాతకం అని గురువుగారు మొన్న చెప్పారు అంతకుముందు పేరు ఎలా పెట్టాడు బాబు గారు అని ఆలోచిస్తుంది నైని. కట్ చేస్తే, అమ్మ హనుమాన్ పూజ ఈరోజుతో పూర్తవుతుంది రేపు ఉగాది అని ఎద్దులయ్య అంటాడు.
పూజ పూర్తయ్యేసరికి అతిధి ఇంటికి రావడం చాలా అదృష్టం మన భాగ్యమని గురువుగారు మన ఇంటికి వచ్చారు అని లలితా దేవి అంటుంది. అన్ని ఇక్కడే ఉన్నాయి హారతి ఇస్తే సరిపోతుంది అని డమ్మక్క అంటుంది. ఇంటి ఇల్లాలు నైని రావాలి కదా అని గురువుగారు అంటారు.ఇంటి ఇల్లాలు మా అక్కేనా మేం కాదా అని సుమన అంటుంది. ఇల్లాలు అని నైని అన్నందుకు సుమన ఫీలైనట్టుంది అని విశాల్ అంటాడు. మాకు అవమానాలు కొత్త ఏం కాదు కదా తమ్మి అని వల్లభ అంటాడు. ఇల్లాలు అంటే అతిధులు ఇంట్లో ఉన్న వాళ్లకి మర్యాదలు చేయడం వల్ల తను ఇల్లాలు అవుతుంది అని లలితాదేవి అంటుంది. సుమన ఏ పని చేయదు కాబట్టి తను ఇల్లాలు కాలేదు అని విక్రాంత్ అంటాడు. నైని ఇంకా రాలేదేంటి అని విశాల్ అంటాడు. పెద్దత్తయ్య గారు నగలరని వేసుకొని రమ్మన్నారు అవన్నీ వేసుకోవాలంటే టైం పడుతుంది కదా అని సుమన అంటుంది. అవన్నీ వేసుకున్న తర్వాత బరువు ఎక్కువైపోయి అడుగు తడబడుతుందేమో అని వల్లభ అంటాడు. నైని ఎన్ని నగలు వేసుకున్న తన అడుగు తడబడదు మాట తడబడదు అని విశాల్ అంటాడు.ఇంతలోనైని వస్తుంది. చెల్లి పెద్ద అత్త ఇచ్చిన నగలు వేసుకోలేదు ఏంటి అని హాసిని అడుగుతుంది. ఇందాకే మీ ఆయన మాట తడబడదు అన్నాడు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు ఏంటి అని వల్లభ అంటాడు.
నైని ఏమైంది అని విశాల్ అంటాడు. నగలు కనిపించడం లేదు బాబు గారు అని నైని అంటుంది. పండగ ప్రశాంతంగా జరుగుతుందని అనుకున్నాను అప్పుడే అని ఎద్దులయ్య అంటాడు. అందరూ సుమనవంక చూస్తారు. ఏంటి అందరు నన్ను చూస్తున్నారు అని సుమన అంటుంది. నీకు అదృష్టం దక్కలేదని ఏమైనా చేస్తావు కదా అని విక్రాంత్ అంటాడు. కావాలంటే వెళ్లి నా గదిలో చూడండి అని సుమన అంటుంది. దీంట్లో వాదన ఎందుకు స్వామి వారు హారతి ఇచ్చాక ఉగాది పచ్చడి స్వీకరించండి అని లలితా దేవి అంటుంది. పోతే పోనీ అని ఊరుకుంటున్నారా అత్తయ్య గారు అని సుమన అంటుంది. నేనిచ్చిన నగలు ఎక్కడికి పోవు అని లలితా దేవి అంటుంది. నైని ఎవరు తీసి ఉంటారని నీకు అనుమానంగా ఉంది అని విశాల్ అంటాడు. గురువుగారు ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వండి అని లలితాదేవి అంటుంది.చైత్ర శుద్ధపౌర్ణమి నాడు బ్రహ్మ ఈ సృష్టిని సంపూర్ణంగా సృష్టించడం వల్లనే ఈ ఉగాది మొదలైంది అని గురువుగారు చెబుతారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగు