Trinayani March 22 2024 Episode 1195: నేను బియ్యం పోసినప్పుడు పాము లేదు అని తిలోత్తమ అంటుంది. నాగయ్య ఎందుకు చేసావో తెలియదు కానీ ఇలా జరిగింది కాబట్టి మంచి జరగడం కోసం అని చూపించు అని అంటుంది నైని. పాము ఎలా చూపించగలదు అని సుమన అంటుంది. అమ్మ పేరు కనిపిస్తుంది చూశారా అని విశాల్ అంటాడు. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. గాయత్రి అమ్మగారి పేరు నాగయ్య పెట్టాడు చూసారా అని సంతోషిస్తుంది నైని. కట్ చేస్తే, ఇలా ఫైల్ మూసేస్తే ఏం చేయమని నిన్ను కన్ను ఆర్పకుండా చూడాలనా? అని విశాల్ అంటాడు. హత్యలు మారని హోమాలు జరుగుతున్న ఇంట్లో ఇలాంటి సరదాలు కూడా ఉంటాయా బాబు గారు అని అంటుంది నైని. ఏదైనా ప్రాబ్లం అయ్యిందా అని విశాల్ అంటాడు.
మీకు చూపిస్తే బాగా అర్థమవుద్ది అని నైని మూలికను చూపించి ఈ మూలికలు నాగయ్య మీద ఉపయోగించి స్పృహ కోల్పోయేలా చేసి తాంబూలంలో పెట్టి బియ్యం పోశారు అని నైని అంటుంది. అమ్మ నామకరణం అయితే పూర్తయిందిగా అని విశాల్ అంటాడు. దుర్మార్గులు తెగిస్తే ఇంకా ఎంత దూరం వెళ్తారు అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను అని అంటుంది నైని. గాయత్రి పాప మా అమ్మని తెలిస్తే మారణ హోమం జరిగేలా ఉంది అని విశాల్ అనుకుంటాడు. కట్ చేస్తే, ఏం చేస్తున్నావ్ అని తిలోత్తమ అంటుంది. నిద్రలేస్తున్నాను మమ్మీ అని వల్లభ అంటాడు. నోట్లో ముద్ర వేస్తే డబ్బులు అన్నా వస్తాయి ఇలా వేలిముద్రలు వేస్తే పిచ్చోడు అనుకుంటారు అని తిలోత్తమ అంటుంది. మరి పెద్దమ్మ ఏస్తే అందరూ ఆహా ఓహో అని చప్పట్లు కొట్టారేంటి మమ్మీ అని వల్లభ అంటాడు. రేయ్ కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకి ఉంటుంది. కూర్చొని తిన్న తరగని కోట్ల ఆస్తి ఉన్న వాళ్లే మాయమైపోతున్నారు అని తిలోత్తమ అంటుంది.
నైనిని వేసేద్దామని ఎన్నిసార్లు ప్లాన్ చేసిన జరగడం లేదు మమ్మీ అని వల్లభ అంటాడు. నడిపి కోడలికి కొన్నాళ్లు రెస్ట్ ఇద్దాము అని ఇంటిలోత్తమ అంటుంది. మరి అంత ఆస్తి ఇంకెవరుకుంది మమ్మీ అని వల్లభ అంటాడు. అది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని తిలోత్తమ అంటుంది. మమ్మీ అది విన్నది అంటే మనల్ని చంపేస్తుంది అని వల్లభ అంటాడు.లలిత అక్కని లేకుండా చేయాలి అని తిలోత్తమ అంటుంది. గాయత్రి పెద్దమ్మని చంపేస్తేనే నిన్ను చంపడానికి పునర్జన్మ ఎత్తి ముప్పు తిప్పలు పెట్టిస్తుంది అలాంటిది లలితాదేవి పెద్దమ్మని చంపేస్తే మనకు పుట్టగతులు ఉండవు అని వల్లభ అంటాడు. రేయ్ ఆమెను చంపేస్తే వేలిముద్రలు పెట్టిన ఆస్తి మొత్తం ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు అని తిలోత్తమ అంటుంది.కానీ గాయత్రి పెద్దమ్మకు తెలుస్తుందేమో అని వల్లభ అంటాడు. తెలివిని ఉపయోగిస్తే చేయొచ్చు అని తిలోత్తమ ఆలోచిస్తుంది. కట్ చేస్తే, ఎద్దులయ్య డమ్మక్క చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఉంటారు. పెద్ద అత్తగారు నేను ఒక మాట అడగొచ్చా అని సుమన అంటుంది. సుమన ఎవర్ని ఇబ్బంది పెట్టని మాట అయితే అడుగు అని విశాల్ అంటాడు.
పిల్లలు లేని పెద్ద అత్తయ్య ఇద్దరు పిల్లలు ఉన్నా నైని అక్కకు ఆస్తిని ఎందుకు రాసిచ్చింది అని సుమన అంటుంది.నేను ఆస్తిని నైనికి విశాల్ కి రాసి ఇవ్వలేదు కావాలంటే డాక్యుమెంట్ సరిగ్గా చదువుకో సుమన అని లలితా దేవి అంటుంది.నా చెల్లెలు పునర్జన్మ ఎత్తి చలామణి అవుతున్న సరే మా అక్క చెల్లెల ఆస్తి తనకే చెందుతుందని రాశాను అని లలితా దేవి అంటుంది. ఇంకా ఏ డౌట్లు లేవు కదా అని విక్రాంత్ అంటాడు.సైలెంట్ అయిపోయిందంటే అర్థం చేసుకుందని అని విశాల్ అంటాడు. లలితా దేవికి బట్టలు పెట్టాలనుకున్నారు హాసిని అని ఎద్దులయ్య అంటాడు. కోట్ల ఆస్తి రాసిచ్చాక పెట్టక ఏం చేస్తారు అని సుమన అంటుంది. నోరు మూసుకొని ఉండమన్నారు అని విక్రాంత్ అంటాడు.
నైని లలితా దేవికి బొట్టు పెడుతుంది. వస్త్రములు పెట్టి కాళ్ళు మొక్కుతారు ఇద్దరు . ఇంతలో దురంధర అక్కడికి వస్తుంది. నేను రాకముందే కార్యక్రమం జరిపిస్తున్నారు అని దురంధర అంటుంది. ఇంతలో నాగయ్య అక్కడికి వస్తాడు. నైని పాము పడగ విప్పి నా వైపే చూస్తుంది అని దురంధర అంటుంది. నాగయ్య పిన్నికి అడ్డం తప్పుకో అని నైని అంటుంది. పెద్ద వదినకి గాయత్రి పాపకి కాఫీ పాలు తెచ్చాను అడ్డు తప్పుకో నాగరాజా అని దురంధర అంటుంది. పెద్దమ్మ గాయత్రి పాపకి నామకరణం చేసింది కదా గాయత్రి పాపకి పాలు తాగించి పెద్దమ్మ టీ తాగి విశ్రాంతి తీసుకుంటుందేమో అని వల్లభ అంటాడు.
నైని నాగయ్యను వెళ్ళమని చెప్పు అని విశాల్ అంటాడు. నాగయ్య పక్కకు వెళ్ళు అని నైని అంటుంది. నాగయ్య వెళ్ళడు అని లలితాదేవి అంటుంది.పెద్దమ్మ అత్తయ్య పాప కోసం పాలుతెస్తే నాగయ్య ఎందుకు జరగడు అని విశాల్ అంటాడు.మమ్మీ మనం అందులో ఏదో కలిపామని పెద్దమ్మకు తెలిసిపోయిందా అని వల్లభ అంటాడు.చండాలమేమైనా జరిగి ఉండొచ్చు అని సుమన అంటుంది. కలిసిపోనిది ఏదైనా కలిసిందేమో అని డమ్మక్క అంటుంది. కలపరానిది కలిపారేమో అని ఎద్దులయ్య అంటాడు..
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!