Big Breaking: గవర్నర్ కోటాలో ఖాళీ అయినా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. సీఎం జగన్ ఆయనను కలిసి వచ్చిన గంట వ్యవధిలోనే ఆ నాలుగు పేర్లుకి ఆమోదం తెలుపుతూ రాజముద్ర వేసేసారు. దీంతో ఆ నలుగురు పేర్లు విషయంలో జరుగుతున్న చర్చ, కలుగుతున్న అనుమానాలు నివృత్తి అయిపోయాయి. ఈ క్రమంలో తాజగా ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, కొయ్యే మోషేను రాజు, రమేష్ యాదవ్ ఎంపికయ్యారు.
Must Read: సీఎం – గవర్నర్ భేటీకి ముందు పరిస్థితులు ఇవీ.. ఎమ్మెల్సిల విషయంలో ఉత్కంఠ.. ఎందుకంటే..!?
Big Breaking: Governor Accepted 4 MLC List
Big Breaking: జగన్ కలిసిన గంటలోనే..!?
నిజానికి ఈ పేర్లు మోదించాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వం మూడు రోజుల కిందటే లిస్టుని పంపించింది. కానీ రెండు పేర్లు విషయంలో గవర్నర్ కొన్ని అభ్యంతరాలను తెలిపారని వార్తలొచ్చాయి. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు పై క్రిమినల్ కేసులు ఉండడంతో ఎంపికపై కొంత ప్రతిష్టంభన నెలకొంది. అందుకే ఈ జాబితా మూడు రోజుల నుండి గవర్నర్ కార్యాలయంలో కదల్లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 5 . 40 వరకు సీఎం జగన్ – గవర్నర్ ల భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఈ చర్చ జరిగింది. గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలకు జగన్ వివరణ ఇవ్వడంతో అంతా సానుకూలంగా ముగిసింది. ఈ భేటీ జరిగిన గంట వ్యవధిలోనే ఈ పేర్లు ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం నుండి ఉత్తర్వులొచ్చాయి..!