aging problem: ప్రతి ఒక్కరూ అనారోగ్యం దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యానికి హాని కల్గించే వాటికి దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు కారణంగా కొంత మంది 50 ఏళ్ల నుండే ముసలివారై పోతూ ఉంటారు. కొంత మందికి 80 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉంటారు. అందుకు కారణం వాళ్లు తినే ఆహారమే. మనం తినే పదార్ధాలకూ మన శరీరం, ఆరోగ్యానికీ సంబంధం ఉంటుంది. వయసులో ఉన్నప్పటి నుంచే సరైన ఆహారం తింటూ ఉంటే త్వరగా ముసలితనం రాదు. వచ్చినా ఆనారోగ్యాలు పెద్దగా ఉండవు. అలాంటి పరిస్థితి రావాలంటే..వైద్యులు అయిదు రకాల పదార్ధాలను తినడం మానేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడో ఒక సారి తింటే ఫరవాలేదు కానీ రెగ్యులర్ గా మాత్రం వాటిని తినకూడదు.
బర్గర్, పీజాలు టేస్టీగా ఉంటాయి గానీ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తాయి. ఇవి మన చర్మంపై ఉండే కాంతిని పూర్తి గా పొగొడతాయి. బాడీ పార్టులకు కొవ్వు అతికిస్తాయి. ఫలితంగా పొట్ట వచ్చేస్తుంది. పొట్టలో కొవ్వు పేరుకుపోవడం వల్ల చాలా రోగాలు వచ్చేందుకు దారి తీస్తుంది. ఫాస్ట్ ఫుడ్ ఎంత తింటే అంతలా ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుతాయి. ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్లకు హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. దాన్ని ఎంత తగ్గిస్తే అంతలా మీరు ముసలితనానికి దూరం అవుతారు. అదే విధంగా కేక్ లు, పాస్ట్రీలు, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కొవ్వును పెంచుతాయి. కొవ్వు ఎంత పెరిగితే ముసలితనం అంత త్వరగా వస్తుంది. చిప్స్, మద్యం తాగడం, స్మోకింగ్ వంటివి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఎనర్జీ డ్రింక్ లు, కూల్ డ్రింకులు తాగడం మానేయడం మంచిది. వాటికి బదులుగా ఫ్రూట్ జ్యూస్ తాగితే మేలు.