మనం నిద్ర లేచిన వెంటనే ముందుగా చేసే పని మన దంతాలను శుభ్రం చేసుకోవడం.బ్రష్ చేసిన తర్వాతనే ఏ పని అయినా చేస్తాము.మన నోటి ఆరోగ్యం కోసం దంతాలను శుభ్రపరుచుకోవటం తప్పనిసరి. రాత్రి నిద్ర పోయిన తర్వాత పొద్దున లేవగానే నోటి నుండి దుర్వాసన వస్తుంది.నోటి దుర్వాసన పోగొట్టుకోవడం కోసం పళ్ళను తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాలి. పళ్ళు శుభ్రంగా లేకపోతే నోటిలో తయారయ్యే బ్యాక్టీరియా వలన గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది.కాబట్టి రోజూ పళ్లు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.
బ్రష్ చేసే తీసుకోవలిసిన జాగ్రత్తలు :
పళ్లు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ ను ఉపయోగించి పుక్కిలించుకోవడం మంచిది కాదు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. పెద్దల దగ్గర నుండి రెండేళ్ళ వయస్సు దాటిని పిల్లలకు తప్పనిసరిగా బ్రషింగ్ చేయించాలి. పిల్లలకు అయితే పిడియాట్రిక్ టూత్ పేస్టుతోనే పళ్లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. పళ్లు తోముకోవడానికి మరీ సాఫ్ట్ బ్రష్ వాడకూడదు. అలాగని మరీ హార్డ్ బ్రష్ కూడా వాడొద్దని డెంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే హార్డ్ గా ఉండే బ్రష్ ల వాడితే దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలిగిపోతుంది.
పిల్లల దంతాల విషయంలో కేరింగ్ :
నిజానికి పొద్దునే లేచిన తరువాత కాకుండా రాత్రి అన్నం తిని పడుకునే ముందు బ్రషింగ్ చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు, క్రిములు పోతాయి. టూత్ పేస్టును తక్కువ మొత్తంలో బ్రష్ పై వేసుకుని మూడు నిమిషాలపాటు బ్రష్ చేయాలి అంతేకాని అదే పనిగా గంటల తరబడి దంతాలను శుభ్రపరిస్తే పళ్లపై ఉండే ఎనామిల్ పొర పోతుంది. ఫలితంగా పళ్లు జివ్వుమని లాగుతూ ఉన్న సెన్సేషన్ వస్తుంది.పళ్ళు తోమిన వెంటనే నాలుక బద్దను ఉపయోగించి నాలుకను శుభ్రం చేసుకోవాలి. చిన్నపిల్లలకు దగ్గర ఉండి పళ్ళు తోమడం నేర్పించాలి.