Diabetes: రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే మధుమేహం వస్తుంది.. ఈ సమస్య ఒక్కటి వస్తే చాలు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. డయాబెటిస్ ఉన్నవారికి దృష్టి లోపాల సమస్యలు వస్తాయా..!? ఒకవేళ వస్తే ఎందుకు వస్తాయి..!? షుగర్ ఒక కారణమా..!? లేదా మరి ఏమైనా కారణాలు ఉన్నాయా తెలుసుకుందాం..!!
మధుమేహం సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ క్యాటరాక్ట్, గ్లకోమా నర్వ్ పాల్సి, ఆప్టిక్ న్యూరోపతి కనురెప్ప కు తరచు వచ్చే ఇన్ఫెక్షన్స్, కనురెప్పలు వాలిపోవడం, కంటిలోపల ఉండే పోర కంజెంక్టివాకు ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు వీరికి వస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పై కంటి సమస్యలు ఆధారపడి ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు ఎల్లప్పుడూ రక్త పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ షుగర్ లెవెల్స్ నియంత్రణలో లేకపోతే కంటి సమస్యలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే మధుమేహం నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం వారికి నేత్ర సమస్యలు తక్కువగా వస్తున్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అందువలన మధుమేహంతో బాధపడుతున్న వారు సంవత్సరానికి ఒకసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో నేత్రాలను దీర్ఘకాలంగా పదిలంగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. డయాబెటిస్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహార నియమాలతో పాటు వ్యాయామం కూడా చేయాలి.