మారుతున్న జీవనశైలితో పాటుగా మనుషుల ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఫలితంగా చిన్న వయసులోనే రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా చాలా మంది ఎదురుకుంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి అనే చెప్పాలి. వయసుతో పని లేకుండా షుగర్ వ్యాది బారిన పడిన వాళ్ళు చాలానే ఉన్నారు. అయితే షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలంటే మందులతో పాటుగా తినే తిండి విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి.
షుగర్ వ్యాధి గ్రస్థులు ఆహారం విషయంలో జాగ్రత్తలు :
ముఖ్యంగా షుగర్ వచ్చినవారు కూరగాయలు తినే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కూరగాయలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ డయాబెటిక్ పేషెంట్లు కొన్ని రకాల కూరగాయలు తినకపోవడమే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ఎలాంటి కూరగాయలను తినకూడదో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళదుంప :
షుగర్ ఉన్నవాళ్లు బంగాళదుంపలకు కాస్త దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే దుంపలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి.అందుకే షుగర్ వ్యాధి వచ్చినవారు బంగాళాదుంపలకు దూరంగా ఉంటే మంచిది.అలాగే బంగాళదుంపలు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ను కూడా కలిగి ఉంటాయి.
మొక్కజొన్న:
మొక్కజొన్నలను కూడా షుగర్ వ్యాధి వచ్చినవారు తినకుడదు. వీటిలో కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ ఎక్కువగానే ఉంటుంది.ఒకవేళ కండి తినాలనుకుంటే ఫైబర్ అధికంగా ఉండే ఆహారంలో కలుపుకుని తినాలి.
బఠానీలు :
బఠానీలలో కూడా పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి.అందుకే మధుమేహం ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.
కూరగాయల రసం:
పచ్చి కూరగాయల రసం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ ఫైబర్ లోపం ఉండే కారణం చేత డయాబెటిక్ రోగులకు కూరగాయల రసం మంచిది కాదంటున్నారు నిపుణులు.