పాలు శరీరం బయట, లోపల కూడా క్లెన్సర్ లా ఉపయోగపడతాయి. పాలు రోజు తాగడం వల్ల చర్మగ్రంథులు శుభ్రపడతాయి. పాల లోని గుణాలు మురికిని, మృత కణాల ను బయటికి పంపేస్తుంది.పాలతో ముఖం అందం గా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం . పాలు బ్లాక్ హెడ్స్, మొటిమ లు రాకుండా అడ్డుకుంటాయి. దూదిని పాలల్లో ముంచి ముఖంపై నెమ్మది గా మర్ధనా చేసి,అయిదు నిమిషా ల తరువాత గోరువెచ్చని నీటి తో ముఖం కడుక్కోవాలి. అలా చేయడం వలన ముఖంపై ఉన్న జిడ్డు తో పాటు, మురికి పోయి శుభ్రపడుతుంది.
పాలల్లో అరటి పండు గుజ్జు ను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం పొడిగా మారడం తగ్గి, తేమ గా మారుతుంది. ప్రతి రోజు పెదాలకు పాల తో మర్ధనా చేస్తూఉంటె పెదాల నలుపుదనం పోయి అందంగా కనిపిస్తాయి. బిరుసెక్కిన పెదాలకు లిప్స్టిక్రాసే ముందు పాలలో ముంచిన దూదితో పెదాలను తుడిచి, లిప్స్టిక్ రాస్తే పెదవులు నిగారించినట్లు కనిపించటమే గాక ఎక్కువసేపు ఆ మెరుపు ఉంటుంది.
పొడిచర్మం ఉన్న వారైతే దూదిని పాలలో ముంచి ముఖమంతా మర్ధనా చేసుకుని , 20 నిమిషాల పాటూ అలా వదిలేయాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది .ఎండలో చర్మం కమిలినట్టు అయితే ఫ్రిజ్లో ఉంచిన చల్లని పాలను ముఖానికి పట్టించడం వలన ముఖం మండడం తగ్గిపోతుంది.పాలల్లో ఒక స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి కొంత సమయం తర్వాత స్నాసం చేయడం వల్ల మంచి టోన్ లభిస్తుంది.పాలలో కొంచెం ముల్తాని మట్టి కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోని, 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.