ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవాటు చేసుకుంటూ ఉంటారు. మరి ఆ అలవాట్లు ఏంటో ఒకసారి తెలుసుకుందామా.. చాలా మంది పాలు త్రాగితే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది అని పాలు తాగుతు ఉంటారు.అయితే కొందరికి పాలు అంటే నచ్చదు. అలాంటివారు పాలకు బదులుగా తెల్ల నువ్వులు కూడా తినవచ్చు. ఎందుకంటే పాలలో కన్నా ఎక్కువ క్యాల్షియం తెల్ల నువ్వులలో దొరుకుతుంది. అలాగే వేడిగా ఉండే ఆహార పదార్ధాలను తినటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆరోగ్య చిట్కాలు :
చాలా మంది ఆకు కూరలను తినడానికి ఇష్టపడరు. కానీ, వారానికి కనీసం మూడు సార్లు ఆకు కూరలు కచ్చితంగా తినాలి. ముఖ్యంగా తోటకూర, పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే పిల్లలకు
ఉడకబెట్టిన శనగలు, వేరుశనగలు, అలచందలు మొదలైనవాటిని పెట్టడం చాలా చాలా మంచిది. కనీసం వారానికి రెండు రోజులైనా ఈ స్నాక్స్ వారి ఆహారంలో ఉండేట్లు చూచవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.వారానికి రెండు లేదా మూడు సార్లు కాలాన్ని బట్టి దొరికే అన్నిరకాల పండ్లను స్నాక్స్ పెట్టవచ్చు.తినే ఆహార పదార్ధాల తయారీలో చెక్కర వాడకాన్ని తగ్గించాలి. ఉప్పు వినియోగం కూడా తగ్గించాలి.వాడకానికి సముద్రపు ఉప్పు చాలా మంచిది.ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి కచ్చితంగా అలవాటుగా చేసుకోండి.
ఆహారంతో పాటు యోగా, ధ్యానం :
ప్రతి మనిషికి కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం.టీ, కాఫీలకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. రాగిజావ ఆరోగ్యానికి చాలా మంచిది.
కూరగాయలను, పండ్లను మార్కెట్ నుండి తెచ్చిన తరువాత గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి 15 నిమిషాలపాటు ఉంచండి. ఆ తరువాత ఆ నీటిని పారపోసి మరలా వాటిని కడగాలి ఇలా చేయడం వలన హానికరమైన రసాయనాలను తొలగించవచ్చు.
అలాగే ప్రతి ఒక్కరు కనీసం రోజుకు 5 లీటర్లు నీరు అయినా త్రాగాలి. వీలైతే చల్లని నీరు కన్నా గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి అత్యంత మంచిది.