Diabetes: మధుమేహం వినడానికి తియ్యగా ఉన్నా.. ఒక్కసారి ఇది వస్తే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే.. అలా అని భయపడాల్సిన పనిలేదు.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకుంటే చాలు.. కోచ్చి పరిశోధకులు డయాబెటిస్ పై పరిశోధనలు చేసి ఓ విషయాన్ని కనుగొన్నారు..!! అదేంటంటే..!?
కొచ్చి పరిశోధకులు చేసిన కొత్త అధ్యాయంలో పచ్చి పనస పొడి మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కర గ్లైకోసైలేటెడ్ హిమోగ్లోబిన్ HBA 1 C ను తగ్గిస్తుందని వారు తెలుసుకున్నారు. డయాబెటిక్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిక్ రోగుల్లో గ్లైసేమిక్ నియంత్రణను మెరుగు పరిచేందుకు ఈ పచ్చి పనస పొడి అధ్బుతంగా పనిచేస్తుంది వారు కనుగొన్నారు. ఇక పచ్చి పనస పొడి అన్ని రకాల ఈ కామర్స్ సైట్స్, మార్కెట్స్ లో దొరుకుతుంది.
Jack Fruit: ఈ పండులో ఎన్నో ఔషధ గుణాలు..!! ఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందంటే..
పనస పొడి మధుమేహులకు వరం. సాధారణంగా మనం వంటల కు బియ్యం, గోధుమ , మైదా పిండిని ఉపయోగిస్తాము. వీటికి బదులుగా పనస పిండిని వాడుకోవచ్చు. ఈ పిండి తో ఇడ్లీ, దోశ,ఉప్మా, చపాతీ, కుకిస్ ఇలాగా మీకు నచ్చిన విధంగా చేసుకుని తినవచ్చు. . పనస పిండిని తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్స్ మోతాదు తగ్గుతుంది. ఈ పిండిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కేలరీలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఫలితాలు ఇస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది. పనస పండు అందరూ తినడానికి ఇష్టపడతారు. అయితే పచ్చి పనస కాయ మధుమేహులకు రక్షణ గా నిలుస్తుంది. షుగర్ ఉన్నావారి లో డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.