ప్రస్తుతం మనం తినే ఆహార పద్ధతిలో ఎన్నో మార్పులు ఉన్నాయి. అంతా బయట దొరికే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ఎక్కువ జంకు పదార్థాలను ఇష్టపడుతున్నారు. దీని వల్ల ఆరోగ్యంలో సమస్యలు ఎదురవుతున్నాయి. బయట ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణం ప్రక్రియ సరిగా ఉండదు. దాని వల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి.
మన ఆరోగ్యంలో ఎక్కువగా సమస్యల బారిన పడడానికి కారణం మనం తినే ఆహార పదార్థాలలో ఉన్న మార్పు.. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఎక్కువగా కూరగాయలను తీసుకోవడం మంచిది. దీనివల్ల ఆరోగ్యం లో ఎలాంటి సమస్యలు ఎదురు కావు. మనం పండించే కూరగాయల్లో ఎక్కువ ప్రోటీన్ లు, విటమిన్లు ఉంటాయి. అంతేగాక ఈ వెజిటేరియన్ వల్ల జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది.
మాంసాహారం కంటే శాకాహారమే ఎక్కువ. మాంసాహారంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. శాకాహారంలో కూడా కొంతవరకు కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ దానివల్ల ఎక్కువ సమస్యలు రావు .కావున శాకాహారం తీసుకోవడమే చాలా వరకు మంచిదని వైద్య నిపుణులు తెలిపారు. మనం తీసుకునే కూరగాయలు, పండ్ల లో ఎక్కువ పోషక విలువలు ఉండటం వల్ల జీవిత కాలంను పెంచే మార్గాలు ఎక్కువగా వుంటాయి.
ఇక వీటిలో ఎక్కువగా ఫైబర్ లను కలిగి ఉంటాయి. వీటి వల్ల శరీరానికి ఆహారపదార్థాలు జీర్ణం కావడానికి తోడ్పడ్డాయి. అంతేకాకుండా మన శరీరానికి నీరు అనేది ముఖ్యం. దాని వల్ల మన శరీరంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మనం తీసుకునే కూరగాయల్లో, పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ తో బాధపడేవారు శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ శాతం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా మన శరీర చర్మం సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా పండ్లను,కూరగాయలను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు తెలిపారు. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలను ఎక్కువ జంక్ ఫుడ్ ను కాకుండా శాకాహారం తీసుకోవడం ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకావు.