మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు పెరిగిపోతున్నారు.ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, శరీరానికి పని చెప్పకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వంటి కారణాల వలన చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.అధిక బరువు కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే బరువు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.కానీ ఫలితం మాత్రం ఉండదు.అయితే బరువు అనేది సహజసిద్ధంగా తగ్గితేనే ఆరోగ్యానికి మంచిది. అందుకే మేము. చెప్పే ఈ డ్రింక్ ప్రతిరోజు ఉదయం తాగితే 15 రోజుల్లోనే మీ శరీరంలో వచ్చే మార్పును మీరు గమనిస్తారు.మరి ఆ డ్రింక్ ఏంటి?ఎలా తయారుచేయాలి అనేది చూద్దాం.
కావలిసిన పదార్ధాలు:
నల్ల ఎండు ద్రాక్ష -ఆరు
వాల్ నట్స్ -రెండు
అంజీర్ -రెండు
బాదం పప్పులు -4
పైన చెప్పిన అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకుని ఎందుకో ఒక కప్పు నీటిని పోసి వాటిని రాత్రంతా చక్కగా నీటిలో నానపెట్టాలి.ఆ మరుసటి రోజు ఉదయం బాదం పప్పుల పైన తొక్కను తీసివేయాలి. తరువాత నానపెట్టిన నీటితో సహ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తని జ్యూస్ లాగా మిక్సీ పట్టాలి.ఆ తర్వాత అందులో ఒక కప్పు పాలు, గింజలు తీసిన మూడు ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మరోసారి గ్రైండ్ చేస్తే ఎంతో రుచికరమైన హెల్తీ డ్రింక్ సిద్ధమవుతుంది. ఈ డ్రింక్ ని బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే ఆకలి తగ్గడంతో పాటుగా కడుపు నిండిన భావన కూడా వస్తుంది.అలాగే తొందరగా ఆకలి కూడా వేయదు.ఈ డ్రింక్ తాగటం వలన జీవ క్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణం అయ్యి తిన్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారుతుంది. దాంతో వేగంగా బరువు తగ్గుతారు.అంతేకాకుండా నీరసం, అలసట కూడా లేకుండా రోజంతా హుషారుగా చురుకుగా పనులు చేసుకుంటారు.