NewsOrbit
జాతీయం న్యూస్

Aravind Kejriwal: ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా

Aravind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింగ్ కేజ్రీవాల్ కు రెండు రోజుల క్రితం ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సమన్ల ప్రకారం ఇవేళ (21వ తేదీ) ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హజరు కావాల్సి ఉంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ నేటి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ నెల 30వ తేదీ వరకూ పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలోని అనంద్ గఢ్ గ్రామంలో జరిగే విపాసన కోర్సుకు ఆయన (సీఎం) హజరు కానున్నట్లు ఆప్ జాతీయ కన్వీనర్ తెలిపారు. కేజ్రీవాల్ పది రోజుల పాటు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటారని వెల్లడించారు.

నిజానికి ఈ విపాసన సెషన్ లో పాల్గొనేందుకు కేజ్రీవాల్ మంగళవారమే బయలుదేరాల్సి ఉండగా, ఇండియా కూటమి సమావేశం నేపథ్యంలో తన షెడ్యుల్ ను వాయిదా వేసుకున్నారని సమచారం. అంతకు ముందు కేజ్రీవాల్ కు ఈడీ నవంబర్ 2వ తేదీన విచారణకు హజరుకావాలని సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమన్లు చట్టవిరుద్దంగా ఉన్నాయని పేర్కొంటూ ఆయన విచారణకు వెళ్లలేదు. తనకు సమన్లు వచ్చిన రోజే కేజ్రీవాల్ అరెస్టు కావొచ్చు అనే ఊహాగానాలు ఊపందుకోవడంతో ఈ సమన్ల వెనుక రాజకీయ ప్రేరణ ఉందని, వీటిని ఉపసంహరించుకోవాలని కూడా కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈడీ రెండో సారి ఆయనకు సమన్లు జారీ చేయడం జరిగింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 16న కేజ్రీవాల్ ను సీబీఐ తొమ్మిది గంటలకుపైగా విచారించింది. ఈ కేసులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ లను ఇప్పటికే అరెస్టు చేయగా, వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అరెస్టు చేసింది.అదే రోజు ఆయన నివాసం సహా సంబంధించిన ఆస్తులపై సోదాలు జరిపింది. ఢిల్లీ డిప్యూటి సీఎం హోదాలో ఉన్న మనీశ్ సిసోడియా ను కూడా ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన అరెస్టు అయిన రెండు రోజులకు తన పదవికి రాజీనామా చేశారు.

ఢిల్లీ సర్కార్ 2022 లో నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఈ విధానంలో భాగంగా కోట్లాది రూపాయలు చేతులు మరాయని ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బును గోవా సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఫండ్ కోసం వినియోగించారని ఈడీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ సర్కార్, ఆప్ ఖండిస్తొంది. అయితే ..విచారణకు అరవింద్ కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన నేపథ్యంలో ఈడీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

AP Election 2024: జగన్ ఊహించినట్లుగానే .. ఏపీలో ఎన్నికలకు మూహూర్తం ఫిక్స్ ..ఢిల్లీ నుండి సంకేతాలు..?

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju