ప్రముఖ స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సంస్థకు డీజీసీఏ షాక్ ఇచ్చింది. తరచూ ఇటీవల స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో సదరు సంస్థపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 నుండి ఎనిమిది సందర్భాల్లో ఆ సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ .. ఈ నెల 6వ తేదీన స్పైస్ జెట్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సాంకేతిక సమస్యలను గుర్తించడం, తనిఖీలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మరో ఎనిమిది వారాల పాటు స్పైస్ జెట్ కేవలం 50 శాతం ఫ్లైట్ లను మాత్రమే నడిపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ నేడొక ప్రకటన లో పేర్కొంది.
బ్రేకింగ్: పోలవరం నిర్వాసితులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..సెప్టెంబర్ లోగా పునరావాస ప్యాకేజీ పరిహారం