NewsOrbit
జాతీయం న్యూస్

Election Commission : కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం..! విపక్షాలు ఏమంటాయో మరి..!!

Election Commission : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సార్వత్రిక ఎన్నికల్లో 70 నుండి 85 శాతం మాత్రమే పోలింగ్ జరుగుతోంది. వివిధ రకాల కారణాలతో పది నుండి 20 శాతం మంది, పలు ప్రాంతాల్లో 30 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు నిర్వహించుకునే వారికి సొంత గ్రామాల్లో ఓటు ఉండటం, వివిధ పనుల వల్ల వేరే ప్రాంతాల్లో ఉండటం తదితర కారణాల వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం ఇంకా పెరిగిేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఓ పక్క ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడానికి ప్రయత్నాలు చేయాలని ఈసీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆదే విధంగా ఓటింగ్ విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నాలు చేస్తున్నది.

Election Commission remote voting system
Election Commission remote voting system

ఈ క్రమంలో భాగంగా రిమోట్ ఓటింగ్ విధానం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నది. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి రిమోట్ ఓటింగ్ విధానం అమలులోకి వస్తుందన్న అశాభావాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రిమోట్ ఓటింగ్ విధానంపై ఈ ఏడాదే పరిశోధన ప్రారంభించామని చెప్పారు. వివిధ ఐఐటీలు, ఇతర సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు నెలల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని అరోరా వెల్లడించారు. మరో పక్క ప్రవాస భారతీయులు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం పై కేంద్ర న్యాయ శాఖకు ఈసీ ప్రతిపాదనలు పంపింది. ఓటరు కార్డును ఆధార్ తో అనుసంధానం చేసే విషయాన్ని కేంద్రం పరిశీలన చేస్తున్నది. ఇది గనుక జరిగితే బోగస్ ఓట్లు తొలగింపు సాధ్యపడుతుంది.

రిమోట్ ఓటింగ్ విధానం వస్తే ఓటర్లు ఎక్కడి నుంచైనా ఓటేసే సౌకర్యం ఏర్పడుతుంది. అయితే గత ఎన్నికల సమయంలో దాదాపు 18 రాజకీయ పార్టీలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. పలు అనుమానాలతో ఈవిఎం ద్వారా ఓటింగ్ ను పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. రాజకీయ పార్టీల అనుమానాలను ఈసీ కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా రిమోట్ ఓటింగ్ విధానాన్ని ఈసీ తీసుకురానున్న నేపథ్యంలో విపక్షాలు దీనిపై ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju