Karnataka Election Results Updates: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ట్రెండ్ వెల్లడవుతోంది. తొలి రౌండ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే సమయానికి కాంగ్రెస్ అధిక్యంతో ఉంది. కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ లీడ్స్ లో కొనసాగుతున్నారు. 115 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 77, జేడిఎస్ 26, ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి. ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వార్తలు వినబడుతున్నాయి. మరో పక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. బళ్లారి ప్రాంతంలో గాలి జనార్థన రెడ్డి పార్టీ వెనుకంజలో ఉంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్ధులు లీడ్ లో ఉన్నారు. దాదాపు పది మంది బీజేపీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు.
క్యాంప్ రాజకీయాలకు సిద్దమవుతున్న కాంగ్రెస్
గెలుపొందిన అభ్యర్ధులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలకు సన్నద్దం అవుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధుల కోసం హైదరాబాద్ లోని హోటల్స్ లో రూమ్స్ బుక్ చేశారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ ఇప్పటికే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తొంది. మరో పక్క బీజేపీ కూడా అటు బెంగళూరు, హైదరాబాద్ లలో హోటల్స్ లో రూమ్ లను బుక్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
కొనసాగుతున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ .. దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ