Maharastra : మహారాష్ట్రలోని నాసిక్ లో ఘోర ప్రమాదం సంభవించింది. డాక్టర్ జాకీర్ హుస్సేన్ ఆసుపత్రి బయట ఉన్న ఆక్సిజన్ ట్యాంకర్ లీక్ అవ్వడంతో రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో 22 మంది కరోనా రోగులు దుర్మరణం పాలైయ్యారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రిలో అనేక మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. దాదాపు 150 మంది రోగులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. బుధవారం మధ్యాహ్నం హాస్పటల్ బయట ట్యాంక్ లో ఆక్సిజన్ నింపుతుండగా లీకైంది. దీంతో ఆసుపత్రిలోకి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనతో ఆసుపత్రి వద్ద భయానక వాతావారణం నెలకొంది.
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రిలోని ఇతర రోగులను రక్షించాలని అవసరమైతే వేరే ఆసుపత్రికి తరలించాలని వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు.
Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Operation to contain the leak is underway.
Nasik Municipal Corporation Commissioner says 23 patients were on ventilator and it is feared that 10-11 patients have lost lives. pic.twitter.com/0bBBptfWe1— Prasar Bharati News Services पी.बी.एन.एस. (@PBNS_India) April 21, 2021