Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ సందర్భంలో రెండు రోజుల క్రితం వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించారు. అయితే గురువారం నాడు కూడా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.
మహారాష్ట్ర సర్కార్ కు ధైర్యం ఉంటే తాను చేపట్టిన భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. గురువారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఇది సావార్కర్ విజన్ కు, మహాత్మా గాంధీ విజన్ కు మద్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఈ అంశంపై చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. తమ పార్టీలో నియంతలు లేరని పేర్కొన్నారు. తను చేసిన వ్యాఖ్యల సమర్ధింపుగా క్షమాబిక్ష కోసం బ్రిటిషర్లకు సావర్కర్ రాసిన లేఖ ప్రతులను చూపుతూ ఆయన బ్రిటిషర్లకు భయపడే ప్రాణబిక్ష ప్రసాదించాలని లేఖ రాశారని చెప్పారు.
మరో పక్క రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత, మహారాష్ట్ర డీప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ స్వాతంత్య్ర సమరయోధుడైన వీర్ సావర్కర్ పై రాహుల్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హిందూత్వ సిద్దాంతాలను అవమానిస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ సావర్కర్ ను అవమానించేలా మాట్లాడితే మహారాష్ట్ర ప్రజలు సహించరని అన్నారు. మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వీర్ సావర్కర్ అంటే తమ పార్టీకి అపారమైన గౌరవం అని తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలను తాము ధ్రువీకరించబోమని అన్నారు.
सावरकर जी ने अंग्रेजों की मदद की। उन्होंने अंग्रेजों को चिट्ठी लिखकर कहा – सर, मैं आपका नौकर रहना चाहता हूं।
– श्री @rahulgandhi pic.twitter.com/1sKszyDXR0
— Congress (@INCIndia) November 17, 2022