Rajinikanth: దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరగకుండా ప్రధాని నరేంద్ర మోడీ చేయడాన్ని తప్పుబడుతూ పలు విపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాగా నేడు ప్రధాన మంత్రి మోడీ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా స్పీకర్ కుర్చీ సమీపంలో సెంగోల్ (రాజదండం) ప్రతిష్టించారు.
సెంగోల్ ప్రత్యేకత ఏమిటంటే .. స్వాతంత్రోద్యమం అనంతరం బ్రిటీష్ పాలకులకు, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కు మధ్య అధికార బదలాయింపునకు గుర్తుగా ఈ రాజదండం నిదర్శనంగా నిలిచింది. ఈ రాజదండాన్నే సెంగోల్ అని అంటారు. ఇది తమిళ పదం. చోళ రాజుల కాలం నుండి ఈ రాజదండం సంప్రదాయంగా వస్తొంది.
ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై స్పందించారు. తమిళశక్తికి ప్రతీక సెంగోల్ అని అభివర్ణించిన రజనీకాంత్..ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. “తమిళ శక్తికి సాంప్రదాయ చిహ్నం సెంగోల్. ఇది ఇప్పుడు కొత్త పార్లమెంట్ లో మరింత ప్రకాశిస్తుంది. ఈ సందర్భంగా తమిళులు గర్వపడేలా చేసిన ప్రదాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు రజనీకాంత్.
New Parliament Building Inauguration: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
இந்திய நாட்டின் புதிய பாராளுமன்றக் கட்டடத்தில் ஜொலிக்கப் போகும் தமிழர்களின் ஆட்சி அதிகாரத்தின் பாரம்பரிய அடையாளம் – செங்கோல்.#தமிழன்டா
தமிழர்களுக்குப் பெருமை சேர்த்த மதிப்பிற்குரிய பாரதப்பிரதமர் @narendramodi அவர்களுக்கு என் மனமார்ந்த நன்றி.
— Rajinikanth (@rajinikanth) May 27, 2023