Russia – Ukrine War: ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఎంతో మంది భారతీయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో భారతీయ విద్యార్ధులు పౌరులు ఈ భయానక పరిస్థితుల మధ్య బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని కేంద్రం నిర్ణయించింది. విమాన చార్జీలు మొత్తం కేంద్రం భరించాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ లో ఉన్న వారిని రోమోనియా, హంగరీ మీదుగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు హంగరీలోని భారత రాయబార కార్యాలయం ప్రకటన చేసింది. దీనిలో భాగంగా శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రెండు ఎయిరిండియా విమానాలు భారత్ నుండి బయలుదేరనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.
Read More: Russia Ukraine War: భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం
Russia – Ukrine War: ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా
రష్యా, ఉక్రెయిన్ మధ్యయుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడే.. భారత పౌరుల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ప్రకటించింది. కానీ ఈ లోపే రష్యా అకస్మాత్తుగా సైనికచర్య ప్రకటించడంతో ఉక్రెయిన్ గగనతలం మూసివేసింది. దాంతో ఢిల్లీ నుండి బయలుదేరిన ప్రత్యేక విమానం వెనక్కి మళ్లాల్సి పరిస్థితి వచ్చింది. దాంతో ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. యుద్ధం తీవ్రతరం కావడంతో తమను తరలించాలని ఉక్రెయిన్ లోని విద్యార్ధులు అభ్యర్ధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.