West Bengal : పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ BJP, ఎలాగైనా అధికారాన్ని కాపాడుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ TMC వ్యూహప్రతివ్యూహలతో ముందడుగులు వేస్తున్నాయి. ప్రధాన మంత్రి మోడీ pm modi, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా amith షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా Nadda పశ్చిమ బెంగాల్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు.
ఆ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా మమతా బెనర్జీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమతా బెనర్జీ కూడా ఏ మాత్రం తగ్గకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ద్వాజమేత్తుతున్నారు. ఇది ఇలాఉంటే.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం సంచలన ఆరోపణలు చేశారు. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మళ్ళీ బీజేపీ పంచన చేరుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్టంలో బీజేపీ, టీఎంసీ బద్ద విరోధులుగా విమర్శలు చేసుకుంటున్నాయి. కానీ వారి మధ్య జరుగుతున్నది నకిలీ యుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే బీజేపీతో టీఎంసీ మైత్రి చేస్తుందని అన్నారు. కోల్ కత్తా లోని బీ గ్రేడ్ మైదానంలో కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త బహిరంగ సభలో బీజేపీ, టీ ఎం సీ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి తృణమూల్ ప్రభుత్వం, మాతతత్వ బీజేపీ బీజేపీ లను అడ్డుకుంటేనే బెంగాల్ లో అభివృద్ధి సాధ్యమని అన్నారు. కోవిడ్ పై పోరు కోసం అంటూ సేకరించిన పి ఎం కేర్స్ నిధులను బీజేపీ ఎన్నికల వేళ నేతల కొనుగోలునకు వినియోగిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.