ఢిల్లీ: క్యాన్సర్ రోగులు వాడే 390 బ్రాండ్లకు చెందిన నాన్ షెడ్యూల్డ్ మందుల ధరలను 87శాతం మేర తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 390 నాన్ షెడ్యూల్ క్యాన్సర్ మందుల గరిష్ఠ చిల్లర ధరలను 87శాతం తగ్గించడం వల్ల 22లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఏటా 800కోట్ల రూపాయల మేర ఆదా అవుతుంది. జాతీయ ఔషద ధరల ప్రాధికార సంస్థ (ఎన్పిపిఎ) ఈ మేరకు ధరలను కట్టడి చేసింది.
తక్షణం తగ్గిన ధరలను అమల్లోకి తేవాలని ఔషద ఉత్పత్తి సంస్థలు, ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మెత్తం 426 బ్రాండ్ల నాన్ షెడ్యూల్ క్యాన్సర్ ఔషదాలు ఉండగా వాటిలో 91శాతం (390) బ్రాండ్ల ధరలను తగ్గించినట్లు వివరించింది. 38 బ్రాండ్ల క్యాన్సర్ ఔషదాలను 75శాతం మేర తగ్గించారు.
42రకాల కేన్సర్ నిరోధక ఔషదాలపై ట్రేడ్ మార్జిన్ 30శాతంకు మించకూడదని జాతీయ ఔషద ధరల నిర్ధాయక ప్రాధికార సంస్థ గత నెల 27న నిర్ణయించింది.
మందుల ధరల తగ్గింపు పట్టికను ఎన్పిపిఎ వెబ్ సైట్లో పెట్టింది.
ఎంఆర్పి ధరలు తగ్గించిన మందుల పట్టిక కోసం కింద క్లిక్ చేయండి