డిల్లి: రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పత్రాలు అపహరణకు గురికాలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తెలిపారు. పిటిఐ వార్తాసంస్థకు శుక్రవారం ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. రఫెల్ కొనుగోలు పత్రాలు తస్కరించారు అంటూ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై రాజకీయంగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
దీనిపై ఎజి వివరణ ఇచ్చారు. కోర్టులో తన వాదనను తప్పుగా అర్ధం చేసుకున్నారని ఎజి వేణుగోపాల్ పేర్కొన్నారు.
‘ ప్రభుత్వం రహస్య పత్రాలుగా పరిగణిస్తున్న వాటి నకళ్ళనే పిటిషనర్లు జత చేశారని బుధవారం సుప్రీం కోర్టుకు తెలియజేసామని’ వేణుగోపాల్ చెప్పారు.
విపక్షాల ఆరోపణలు అవాస్తవమని అని ఆయన అన్నారు.