సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. సాయి పల్లవి ఎంత సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకున్నా కూడా వరసగా మాత్రం అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఈ మధ్య భారీ ప్రాజెక్ట్స్ లో సాయి పల్లవికి అవకాశాలు వస్తున్న క్రమంలో రెమ్యూనరేషన్ కూడా దాదాపు 2 కోట్లు డిమాండ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే సాయి పల్లవి రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినా కూడా దర్శక, నిర్మాతలు సాయి పల్లవి డేట్స్ కావాలని క్యూకడుతున్నట్టు సమాచారం.
ఇప్పటికే నాగ చైతన్య తో లవ్ స్టోరీ అన్న సినిమా కంప్లీట్ చేసింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే రానా దగ్గుబాటి తో విరాట పర్వం సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తయిందని సమాచారం. అంతేకాదు నేచురల్ స్టార్ నాని కి జంటగా శ్యాం సింగ్ రాయ్ అన్న సినిమా చేస్తోంది. ఇలా వరసగా కమిటయిన సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ తో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోషియం లో పవన్ కళ్యాణ్ కి జంటగా .. తేజ దర్శకత్వంలో అలిమేలుమంగ వెంకటరమణ సినిమాలలో నటించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక పెద్ద రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాయి పల్లవి కి ఏకంగా ప్రభాస్ తో నటించే ఛాన్స్ వచ్చిందట. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా సాయి పల్లవి నటించబోతుందని న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఇప్పటికే దిశాపఠాని పేరు వైరల్ అవుతోంది. కాని మేకర్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సాయి పల్లవి అంటున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియా ప్రచారమే అని తెలుస్తోంది. ఒకవేళ ఇది రూమర్ అయితే మాత్రం సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.