Salaar: మహమ్మారి కరోనా పాండమిక్ తర్వాత ఊపిరి పీల్చుకుని సినిమా ఇండస్ట్రీ ఇటీవల విడుదల చేసిన సినిమాలన్నింటిలో టాప్ మోస్ట్ లో “KGF 2”. “KGF” సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ లు సాధించడం జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా… తెరకెక్కిన ఈ సినిమాలో హీరో ఎలివేషన్ ఓ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అటువంటి డైరెక్టర్ “బాహుబలి 2″తో సినిమా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయటమే సంచలనం. దీంతో ఇప్పుడు 2022 ఫస్టాఫ్ లో “RRR”, “KGF 2” కోసం ఎదురుచూసిన సినిమా ప్రేమికులు ప్రభాస్ “సలార్” కోసం ఎదురు చూస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమాకి సంబంధించి షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో పృధ్విరాజ్ కనిపించనున్నట్లు సమాచారం. చాలావరకు ఇటీవల బాలీవుడ్ మొదలుకొని సౌత్ లో పలు ఇండస్ట్రీలకి చెందిన బడా బడా నటీనటులు తెలుగు సినిమాలు చేస్తూ ఉన్నారు. ఫాహిద్.. విజయ సేతుపతి, సముద్రఖని.. బాలీవుడ్ నటీనటులు. ఈ తరుణంలో మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న పృథ్వీరాజ్ .. ప్రభాస్ “సలార్” సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. పృథ్వీ రాజ్ కొత్త చిత్రం “కడువ” కి సంబంధించి హైదరాబాద్ లో ప్రమోషన్ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పృథ్వి రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కరోనా టైంలోనే సలార్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు తేదీలు కుదరక.. సినిమా చేయలేదు. అయితే ఇప్పుడు అంతా కుదిరింది. మరికొద్ది రోజులో ప్రశాంత్ నీల్తో మాట్లాడతా.. అప్పుడు ఆ తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తా అంటూ పృథ్వి రాజ్..సలార్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు.