కరోనా సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురైన సినీ హీరో రాజశేఖర్ హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందనీ, వెంటిలేటర్పై చికిత్స అందుతోందనీ ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. అయితే ఈ ప్రచారాన్ని రాజశేఖర్ సతీమణి జీవిత కొట్టిపారేశారు. రాజశేఖర్ ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తూ వీడియో సందేశాన్ని ఇచ్చారు.
రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందుతోందనీ చెప్పారు. వెంటిలేటర్పై ఉన్నారు అనేది అబద్దమని అన్నారు. ప్రస్తుతం రాజశేఖర్ కు నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందిస్తున్నారని వివరించారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యసేవలు అందించడం వల్ల త్వరగా కోలుకుంటున్నారనీ చెప్పారు. త్వరలోనే ఐసీయు నుండి కూడా బయటకు వస్తారని పేర్కొన్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా అభిమానులు చేసిన ప్రార్థనల వల్లే రాజశేఖర్ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని చెప్పారు జీవితా రాజశేఖర్.
గత నెలలో హీరో రాజశేఖర్తో పాటు ఆయన భార్య జీవిత, ఇద్దరు కుమార్తెలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇద్దరు కుమార్తెలకు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందగా కరోనా తగ్గిపోయింది. రాజశేఖర్, జీవితలు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. జీవిత త్వరగా కరోనా నుండి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. రాజశేఖర్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం గతం కంటే మెరుగుపడింది. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. రాజశేఖర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.