Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేశ్..తెలుగమ్మాయిగా ఇండస్ట్రీలో ఇటు తెలుగు, అటు తమిళ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇంతగా క్రేజీ ఆఫర్ ఐశ్వర్య రాజేశ్ అందుకుటుందని చెప్పాలంటే ఎవరు అనుకోలేదంటున్నారు. అందుకు కారణం తను గ్లామర్ రోల్స్ అండ్ స్కిన్ షోకి దూరంగా ఉండటమే. తెలుగు, తమిళ సినిమాలు ఏవి చేసినా పర్ఫార్మెన్స్ కి ఫుల్ స్కోప్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటోంది ఐశ్వర్య రాజేశ్. ఈమె కెరీర్ ప్రారంభంలో వరుసగా తమిళ సినిమాలు చేసింది. తమిళంలో గ్లామర్ హీరోయిన్లను తట్టుకుని నిలబడటం ఇక్కడ చాలా గొప్ప విషయం.
కోలీవుడ్ లో యంగ్ హీరోలకు జంటగా నటించి యూత్ ను ఆకట్టుకుంది. ఆ తరువాత ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథతో సాగే సినిమాతోనే ఈమె ఇక్కడ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆ తరువాత ‘మిస్ మ్యాచ్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి సినిమాలు చేసింది. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటే వారిలో ఈమెకే ఎక్కువగా పేరు వచ్చింది. ఇది ఐశ్వర్య రాజేశ్ బాగా వాడుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేజిక్కుంచుకుంటోంది.
Aishwarya Rajesh : టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా అంటున్నారు.
ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి చేతిలో 3 తెలుగు సినిమాలు, 5 తమిళ సినిమాలు ఉన్నాయి. ఈ మూడు తెలుగు ప్రాజెక్టులు క్రేజీ ప్రాజెక్ట్స్, తన కెరియర్ కి కలిసొచ్చేవి. దేవ కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రిపబ్లిక్’ లో సాయితేజ్ జోడీగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్ జగదీష్’ సినిమాలోను ఐశ్వర్య రాజేశ్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు ఏకే రీమేక్ లో రానా సరసన నటిస్తోంది. ఇందులో తన పాత్ర బాగా హైలెట్ అవుతుందట. ఈ మూడు సినిమాల తర్వాత టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా అంటున్నారు.