సంక్రాంతి బరిలో దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని కరోనా కారణంగా బాక్సాఫీస్ వద్ద లేని సందడి మళ్ళీ 2021 సంక్రాంతి పండుగ తీసుకు రాబోతోందని అందరూ భావించారు. అయితే సంక్రాంతికి అనుకున్న కొన్ని తెలుగు సినిమాలన్ని 50 శాతం ఆక్యుపెన్సీ తో లాభాలు రావన్న కారణంగా డ్రాపయ్యారు. అయితే మెగా హీరో సాయి ధరం తేజ్ మాత్రం సంక్రాంతి వరకు ఆగకుండా ముందే తన సినిమాని థియేటర్స్ లో దింపుతున్నాడు.
ఇప్పటికే వరసగా చిత్రల హరి, ప్రతి రోజూ పండుగే సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. ఈ నెల 25 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సుబ్బు దర్శకత్వం వహించాడు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రిజల్ట్ మీదే నెక్స్ట్ చాలా సినిమాల రిలీజ్ ఆధారపడి ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ మెగా హీరో మిగతా హీరోలని కదిలించాడని అంటున్నారు.
సాయి ధరం తేజ్ ని చూసి సంక్రాంతి బరి నుంచి తపుకున్న స్టార్ హీరోలందరు మళ్ళీ తమ సినిమాలని రిలీజ్ చేయాలని డిసైడయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాస్ మహారా రవితేజ క్రాక్ సినిమాని సంక్రాంతిబరిలో నిలిపాడు. జనవరి 14 న క్రాక్ రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే రానా అరణ్య కూడా రిలీజ్ కాబోతుంది. కాగా ఇప్పుడు రాం కూడా రెడ్ సినిమాని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడట. డేట్ ఫిక్స్ చేయడమే ఆలస్యం అని రేపో మాపో రెడ్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక అక్కినేని హీరోలు కూడా నిన్నా.. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నప్పటికి ఇప్పుడు అన్నదమ్ముల సినిమాలు లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలని సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్. మొత్తానికి చాలా నెలల తర్వాత సంక్రాంతి సీజన్ కి బాక్సాఫీస్ మళ్ళీ కళ కళలాడబోతోంది అంటున్నారు. చూడాలి మరి ఈ సీజన్ హీరోలకి ఎంతవరకు కల్సి వస్తుందో.