కరోనా విజృంభణతో థియోటర్స్ మూత పడ్డాయి. దాంతో కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. అంతటా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్, ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. ఇక రానున్న రోజుల్లో ఓటీటీలకే ప్రేక్షకులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో ఎలాంటి సందేహాలే లేవు. ఈ నేపథ్యంలోనే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఆహా ని మొదలు పెట్టారు. ఆహా ఆగస్టు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ సందర్భంగా ‘ఆహా’ లో ఈ నెలలో విడుదలయ్యే సినిమాలు, షోల గురించి అల్లు అరవింద్ అండ్ టీమ్ మీడియాతో మాట్లాడారు.
”ఫిబ్రవరి 8న ప్రారంభించిన ఆహా యాప్ కు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 40 లక్షల డౌన్ లోడ్స్ అయ్యాయని… 6 నెలల కాలంలో ఆహా కంటెంట్ ఎలా ఉందని సెర్చ్ చేసిన వాళ్ల సంఖ్య కోటి ఇరవై లక్షలకి చేరిందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక భవిష్యత్తులో థియేటర్లు తెరిచినా కంటెంట్ బావుంటే తప్పకుండా బాగా చూస్తారని తెలిపారు. థియేటర్లు ఓపెన్ చేసినా ఓటీటీలని పక్కన పెట్టేస్తారనుకోవడం లేదంటూ అల్లు అరవింద్ అంటున్నారు. సినిమా..సినిమానే .. ప్రేక్షకుడికి థియేటర్ లో కూర్చున్నప్పుడు ఓ అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి సినిమాకొసం థియోటర్స్ కి వెళతారు..అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే కాస్త సమయం పడుతుందని అన్నారు.
ఇక ఆగస్టు నెలలో స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి పండగలు ఉన్నాయి. కాబట్టి ‘ఆహా’లో దీన్ని ఫెస్టివల్ నెలగా ప్రకటించాం. దసరా సందర్భంలోనూ ఫెస్టివల్ నెలను ప్రకటిస్తాం” అన్నారు అల్లు అరవింద్. థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటీటీలో కంటెంట్ కంటిన్యూ అవుతుందని… ఇప్పటికే చాలా షోలు రెడీ చేస్తున్నాం… యాంకర్ సుమతో ఆల్ ఈజ్ వెల్ షో రెడీ చేశాము. టాలీవుడ్ లో నలుగురు అగ్ర దర్శకులతో భారీ షోలను ప్రారంభించబోతున్నాం. అలాగే ఇంకా కొన్ని షోస్ ని మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఆహా కోసం 42 షోస్ ప్లానింగ్ లో ఉన్నాయి. ‘ఆహా’ కోసం మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆయనకు కాన్సెప్ట్ నచ్చితే ఆయనతోను ఒక షో చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. గతంలో మెగాస్టార్ హోస్ట్ గా మీలో ఎవరుకు కోటీశ్వరుడు వచ్చింది.