Allu Arjun : మెగా కాంపౌండ్ మెయిన్ హీరోలలో ఒకరు అల్లు అర్జున్. Allu Arjun చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరహాలోనే ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకొని..డాన్సు, ఫైట్స్ విషయములో అదేవిధంగా యాక్టింగ్ పరంగా మెగా అభిమానులను అలరిస్తు సరికొత్త సినిమాలు చేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ ఉన్నాడు. గత ఏడాది “అల వైకుంఠపురంలో” సినిమాతో నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం అందరికీ తెలిసిందే. 2020 ఏడాది ఇండస్ట్రీ మొత్తానికి అతి పెద్ద హిట్ అందుకున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించడం జరిగింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా అల్లు అర్జున్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆగస్టు 13వ తారీకు సినిమా రిలీజ్ అవుతుండగా… సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టిస్తూ ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ కి నేషనల్ వైడ్ తరహాలో గుర్తింపు రావటం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఈ న్యూస్ సంచలనం అయింది.
పూర్తి విషయంలోకి వెళితే Gq ఇండియా సర్వేలో ఇండియాలో ప్రభావం చేసే మొదటి 25 మందిలో అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నాడు. దీంతో బన్నీ పేరు ఇండియా వైడ్ గా సరిగ్గా “పుష్ప” సినిమా పాన్ ఇండియా తరహాలో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో మారుమ్రోగుతోంది. ముఖ్యంగా అల వైకుంఠపురం లో బుట్ట బొమ్మ అనే సాంగ్ తో అల్లు అర్జున్ పేరు లాక్డౌన్ సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాక చాలా ఇండస్ట్రీలలో మారుమ్రోగింది. ఇలాంటి తరుణంలో అతి పెద్ద సంస్థ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే మనుషులలో 25 మందిలో అల్లుఅర్జున్ పేరు రావటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇది కచ్చితంగా “పుష్ప” సినిమాకి ఒక ఎసెట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.