గత ఏడాది ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో అల్లుఅర్జున్ అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దాదాపు చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని బన్నీ నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడమే కాక బన్నీ కెరీర్లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది.
సినిమాకి సంబంధించిన సాంగ్స్ సౌత్ ఇండస్ట్రీ లోనే సోషల్ మీడియాలో అనేక రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది. దీంతో సాంగ్స్ తోనే సగానికిపైగా సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నట్టు అయింది. చాలా భాషలలో ‘అల వైకుంఠపురంలో’ సినిమా సాంగ్స్ ఆధారణ దక్కించుకోవడం జరిగింది. అంతేకాకుండా లాక్డౌన్ సమయంలో చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమా సాంగ్స్ కి చిందులేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు.
ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న “పుష్ప” సినిమా మొదటిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని భావించగా తాజాగా 10 భారతీయ భాషల్లో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లే సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక విషయంలో ఆలస్యం అవుతున్నట్లు.. ఇతర భాషల మార్కెట్ కూడా దృష్టిలో పెట్టుకుని నటీనటులను తీసుకుంటున్నట్లు సమాచారం.