Allu arjun : అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా అదీ కాకా అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అల్లు అర్జున్ మేకోవర్ పుష్ప సినిమాకి చాలా హైలెట్ అవుతుందని ఇప్పటికే సెట్స్ నుంచి లీకైన ఫొటోస్ తో పాటు పోస్టర్స్ ద్వారా అర్థమవుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగుతుందని సుకుమార్ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరగుతుండగా రీసెంట్ గా మారేడు మిల్లి ఫారెస్ట్ లో షెడ్యూల్ కంప్లీట్ అయింది. దాదాపు రోజులో షూటింగ్ కోసమే సుకుమార్ 14 గంటల వరకు కష్టపడుతున్నాడు. ఇక ఇప్పటికే పుష్ప సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్.
Allu arjun : అల్లు అర్జున్ పుష్ప సాంగ్ షూట్ కోసం తమిళనాడు కి చేరుకున్నారా..?
దాంతో సుకుమార్ పుష్ప సినిమాని శరవేగంగా కంప్లీట్ చేసేందుకు ఏమాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. కాగా పుష్ప యూనిట్ నెక్స్ట్ ఏం చేయబోతుందో ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా వెల్లడించాడు. పుష్ప చిత్ర యూనిట్ కేరళ వెళుతున్నట్టు జానీ మాస్టర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కొత్తగా అనిపించే మాస్ బీట్స్ ను ఇస్తున్నాడట. ఈ క్రమంలో ఈ పుష్ప సినిమాలో ఉన్న ఒక సాంగ్ షూట్ కోసం తమిళనాడులోని టెన్ కాశిలో పాటను చిత్రీకరించబోతున్నట్లుగా జానీ మాస్టర్ ట్వీట్ ద్వారా తెలిపాడు.