(అనంతపురం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను రుద్రంపేట బైపాస్ సమీపంలో టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వడియంపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన అయిదుగురిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.