కెసిఆర్ నిన్న ఉన్నతస్థాయి సమీక్ష జరిపి రాష్ట్ర విద్యా మంత్రి మరియు అనేక మంది నిపుణులతో చర్చించి చివరికి సంచలన రీతిలో పదవ తరగతి పరీక్షలను తెలంగాణలో రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా వచ్చే నెల నుండి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయగా అతను కూడా కేసీఆర్ బాట పట్టే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజు అత్యధిక మొత్తంలో కరోనా కేసులు నమోదు అవుతూ ఏ మాత్రం వైరస్ వ్యాధి తగ్గుముఖం పట్టినట్లు కనిపించడం లేదు.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ ప్రభుత్వం వచ్చే నెల నుండి జరగవలసిన పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సంచలమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే కొద్ది సేపటి క్రితం ఆంధ్ర సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులో కూడా పదవ తరగతి పరీక్షలు రదు చేస్తున్నట్ళట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇకపోతే పదవ తరగతి పరీక్షల పై నిర్ణయాన్ని ప్రభుత్వం త్వరగా ప్రకటిస్తుందా లేదా పరిస్థితిని అవగాహన వేసేందుకు కొద్దిగా సమయం తీసుకుంటుందా అన్న విషయం వేచి చూడాలి.