గత నెల విశాఖ ప్రాంతంలో జరిగిన ఘోరమైన ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావం ఇప్పుడు మానవాళిని వెంటాడుతోంది. గ్యాస్ లీకేజీ ఘటనలో 12మంది ప్రాణాలు వదలగా దానిని అధిక మోతాదులో పిలిచిన వారు ఇప్పటికీ చనిపోతూనే ఉన్నారు. నిన్న ఒకరు దాని పర్యావసానంగా చనిపోగా… గత వారం మరొక వ్యక్తి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే.
ఎక్కువ మోతాదులో విషవాయువు పీల్చిన వారు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక కొద్ది మోతాదులో పీల్చిన వారిపై స్టైరీన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని వైద్య నిపుణులు మరియు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పుడు అదే నిజం కావడం వైజాగ్ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరుగా వారానికి ఒకరుగా అదే గ్రామానికి చెందిన వృద్ధులు ఆరోగ్యం క్షీణించి హఠాత్తుగా మృత్యువాత పడుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య 15కు చేరుకోగా దీర్ఘకాలికంగా దీని వల్ల సమస్యలు వస్తున్న కారణంగా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని స్థానికులు వాపోతున్నారు. వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకోవాలని…. అందరికీ లైఫ్ లాంగ్ హెల్త్ కార్డులు ఇవ్వాలని మరియు ఏ చిన్న రోగం వచ్చినా ఉచిత వైద్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఈ వార్త ముఖ్యమంత్రి జగన్ వరకు వెళ్లగా ఆయన ఇప్పుడు వైజాగ్ ప్రయాణం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
సోమవారం వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ ముసలయ్య(58) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెలలో జరిగిన గ్యాస్ లీకేజీ మటనలో ముసలయ్య విషవాయువు పీల్చి అపస్మారక స్థితిలో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు. అయితే సోమవారం ఉన్నట్టుండి మునలయ్య ఆరోగ్యం క్షీణించడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులు ఓప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ముసలయ్య సోమవారం సాయంత్రం మృతి చెందాడు.
జగన్ ఇప్పుడు వెంటనే వెళ్లి బాధితులను మరల పరామర్శించి వారికి ధైర్యం చెప్పి రాకపోతే ప్రభుత్వం వారు డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని విపక్షాలు తిట్టి పోస్తారు. కావున జగన్ వీలైనంత త్వరగా వైజాగ్ చేసుకుంటే మంచిది అని వైసిపి పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.