అమరావతి: ఆంధ్రపదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. చివరి రోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభలో అధికార, విపక్ష సభ్యుల మద్య వాడివేడి చర్చ జరిగింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సమావేశాలు ఇవి. ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశాల్లో 19గంటల 25 నిమిషాల పాటు శాసనసభ జరిగింది.
తొలి రోజు సభ్యుల ప్రమాణ స్వీకారాలు, రెండో రోజు స్పీకర్ ఎన్నిక, మూడో రోజు గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగు, ఐదో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ చేపట్టిన చర్చలో పలువురు సభ్యులు మాట్లాడారు. చివరి రోజు సిఎం జగన్ ప్రత్యేక హోదాపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు.