YSRCP: ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో తిరుగుతూ ఉండాలి, సైకిల్ ఎప్పుడూ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలని సీఎం వైయస్ జగన్ పంచ్ డైలాగ్లు విసిరారు. అదివారం రాప్తాడులో ఎన్నికల శంఖారావం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య త్వరలో యుద్ధం జరుగుతోందని అన్నారు.
చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క పథకం గుర్తుకు రాదని అన్నారు. అప్పు ఎగ్గొట్టేవాడు .. పది రూపాయల వడ్డీ అయినా ఇస్తానని అంటాడనీ, అలానే మానిఫెస్టో మాయం చేసి .. హామీలు ఎగ్గొట్టే బాబు కేజీ బంగారం ఇస్తానని అంటాడని సెటైర్ వేశారు. ఒక్క సారి బటన్న నొట్కి ఆశీర్వదిస్తేనే 125 సార్లు బటన్ నొక్కి 2.55 లక్షల కోట్లు పేదలకు పంపిణీ చేశానని అన్నారు. మీరు 2, 3 సార్లు ఆశీర్వదిస్తే.. మరింత మేలు ప్రజలకు, రాష్ట్రానికి జరుగుతుందని జగన్ పేర్కొన్నారు.
నేడు రాయలసీమలో జన సముద్రం కనిపిస్తోందని అన్నారు జగన్. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతున్న యుద్దమనీ, కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం.. పథకాలు కొనసాగాలని అడుగులేస్తున్న మనకు.. వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా? అంటూ పార్టీ శ్రేణులకు సీఎం జగన్ ప్రశ్నించారు.
ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున.. పెత్తందారులు మరోవైపున ఉన్నారన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకూ మధ్య జరుగుతున్నదీ యుద్ధం అని అన్నారు. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ వస్తున్న నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్కు… ఈ గడ్డమీదే పుట్టి.. ఈ గడ్డమీద మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని, ప్రజలమధ్యే ఉన్న మనకూ మధ్య యుద్దం జరుగుతోందన్నారు.
మరో రెండు నెలల్లో జరిగే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పని చేయడానికి.. ఈనాడు, టీవీ5, ఏబీఎన్ తప్పుడు కథనాల నుంచి కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని జగన్ ప్రశ్నించారు. టీడీపీ వారి సోషల్ మీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మీరంతా సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సిద్దం అంటూ ఇక్కడున్న ప్రతీ ఒక్కరూ కూడా మీ సెల్ఫోన్ తీసి టార్చ్ వేసి చెప్పాలన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేద ప్రజలు అన్యాయం అయిపోతారని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి చెప్పాలన్నారు. ప్రజలే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు అని జగన్ అన్నారు.
BJP: మూడో సారి గెలుపుపై అనుమానం అక్కర్లేదు – మోడీ