ఏపికి పెట్టుబడులు రాబట్టే దిశగా వచ్చే ఏడాది మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపి సర్కార్ నిర్వహించనున్నది. ఈ సమ్మిట్ కు సంబంధించిన లోగోను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్ తదితర ఉన్నతాధికారులు హజరైయ్యారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్నాధ్ సమ్మిట్ వివరాలు వెల్లడించారు. 2023 మార్చి 2వ తేదీ నుండి మూడు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలను సమ్మిట్ కు అహ్వానిస్తామని తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగన్ యే వ్యవహరిస్తారని మంత్రి తెలిపారు.
పెట్టుబడులకు గల అవకాశాలను ఆయా పారిశ్రామిక దిగ్గరాజలకు వివరించడంతో పాటు ఆయా కంపెనీలు ఏపిలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని మంత్రి అమరనాథ్ తెలిపారు.కరోనా కారణంగా గడచిన మూడేళ్లుగా ఈ తరహా సదస్సులను నిర్వహించలేకపోయామన్నారు. ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలు నిర్వహించడం ప్రారంభించాయని చెప్పారు. ఎంఎస్ఎంఈలపైనా ఫోకస్ పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి మౌళిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం, భవనపాడు పోర్టులను నిర్మిస్తున్నామనీ, విశాఖ, కాకినాడ పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అయిదు షిప్పింగ్ హర్బర్ల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. రాామాయపట్నం పోర్టుకు 2024 జనవరి నాటికి మొదటి షిప్ తీసుకువస్తామనీ, దేశానికి ఏపినే గేట్ వే గా మారబోతోందని మంత్రి అమరనాథ్ పేర్కొన్నారు.
విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్ తదితర ఉన్నతాధికారులు హాజరు. pic.twitter.com/eQbvlvQo3o
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 8, 2022