(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధిలో దొంగలు పడ్డారు. సహాయ నిధి బ్యాంకు ఖాతా నుండి కోట్లు కాజేయడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన ఎస్ బి ఐ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చింది. దీనిపై అప్రమత్తం అియన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇది ఎవరు చేశారు?. ఎందుకు చేశారు? అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఏకంగా రూ.112 కోట్లు నకిలీ చెక్కులతో కాజేయడానికి ప్రయత్నించడం ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు పరిశీలిస్తే….
మూడు చెక్కులు…రూ.112 కోట్లు
ఈ నెల 7వ తేదీన శర్మ ఫోర్ సింగ్ పేరిట రూ,.39కోట్ల 85లక్షల ఒ చెక్కు ఢిల్లీ ఎస్ బి ఐ బ్రాంచికి చేరింది. ఈ నెల 9వ తేదీన 52కోట్ల 65లక్షల చెక్కు బెంగళూరు సర్కిల్ లోని మంగళూరు పరిధిలో ఉన్న మూత్ భద్రి బ్రాంచిలో పడింది. ఆ తరువాత కలోకత్తా పరిధిలో ఈ నెల 14వ తేదీన 24కోట్ల 65లక్షల చెక్కు పడింది. ఈ మూడు చెక్కులు నకిలీవేనని బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో లావాదేవీలు అక్కడితో నిలిపివేసి ముఖ్యమంత్రి సహాయ నిధి అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తం అియన అధికారులు వెంటనే తేరుకుని చెక్కుల విషయాలను, లావాదేవీలను ఎవరి పేరిట ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు అనేది మొత్తం ఆరా తీయగా అసలు ఆ చెక్కులు బయటకు ఇవ్వలేదనీ అవన్నీ నకిలీవేనని నిగ్గు తేల్చారు.
ఏకంగా సీఏం సహాయ నిధి ఖాతాకే నకిలీ చెక్కులు సృష్టించడం వందల కోట్ల రూపాయల నగదుకు టోపీ పెట్టాలని ప్రయత్నించడం, ఐఎఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేయడం ఒ పెద్ద కుంభకోణంగా కనిపిస్తోంది. దీనిపై ప్రస్తుతానికి దీనిపై పోలీసులకు పిర్యాదు అందనప్పటికీ సోషల్ మీడియాలో ఈ చెక్కులు, ఈ వ్యవహారం మొత్తం చెక్కర్లు కొడుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాధమికంగా పోలీసులకు సమాచారం అందించారు. ఒక వేళ ఇదే వాస్తవం అయితే మాత్రం ఏపి ప్రభుత్వం అప్రమత్తమై సీఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది.