అమరావతి : విశాఖ డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ సందర్భంగా మద్యం మత్తులో సీఎం జగన్, పిఎం మోడీలను దుర్భాషలాడిన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ ను విశాఖ మెంటల్ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే విశాఖ మెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్ ను వేరే ఆస్పత్రికి మార్చాలని ఆయన తల్లి కావేరీ బాయి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్ అయ్యేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తీసుకుని డాక్టర్ సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని కోర్టు తెలిపింది. సీబీఐ విచారణకు సహకరించాల్సిందిగా సుధాకర్కు హైకోర్టు స్పష్టం చేసింది. డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిపై వేసిన పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం మరో తీర్పును కూడా వెల్లడించింది. డాక్టర్ సుధాకర్ను బంధువులకు అప్పగించాలని ఆదేశించింది.
మరో వైపు ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నర్సీపట్నం చేరుకున్న సిబిఐ అధికారులు తొలుత ఆస్పత్రిలో, తరువాత మున్సిపల్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. అధికారుల నుండి పలు వివరాలు సేకరించారు. రికార్డ్లు పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా ఈ కేసుకు సంబంధించి డాక్టర్ సుధాకర్పై కూడా సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.