అరవింద సమేత .. వీర రాఘవ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ – రాం చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్ సహా భారీ తారాగణం నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.
కాగా వరుస హిట్స్ తో నందమూరి అభిమానులను హుషారెత్తిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రం తర్వాత మరో మూవీకి కమిట్ అయ్యాడు. ఇప్పటికే విపరీతమైన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా “అరవింద సమేత” చిత్రంలో ఆ మాస్ యాంగిల్ డోస్ పెంచి ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ ను చూపించిన దర్శకుడు త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు ఎన్టీఆర్. ఈ చిత్రానికి “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఫ్యాక్షన్ సినిమాలు తీసి క్రేజ్ తెచ్చుకున్న దర్శకులకు కూడా రాని కొన్ని ఆలోచనలు త్రివిక్రమ్ అరవింద సమేతలో చూపించాడు.
ఈ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటుగా నందమూరి అభిమానులను కూడా ఫుల్ ఖుషీ చేసింది. దీంతో వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంకా ఈ సినిమా మొదలవకుండానే రిలీజ్ డేట్ లాక్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అరవింద సమేత 2018 లో దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ గా నిలిచింది. అందుకే ఇప్పుడు త్రివిక్రం – ఎన్.టి.ఆర్ కాంబోలో రాబోతున్న సినిమాని కూడా 2021 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.