ఢిల్లీ, మార్చి 8: అయోధ్య భూవివాదం కేసు పరిష్కారానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తుల ప్యానెల్లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ పేరు చేర్చడంపై ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి అభ్యంతరం వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు మధ్యవర్తుల ప్యానెల్ ప్రకటించిన అనంతరం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
రవిశంకర్ స్థానంలో తటస్థంగా వ్యవహరించే మధ్యవర్తిని సర్వోన్నత న్యాయస్థానం నియమించాలని కోరారు.
అయోధ్యపై ముస్లింలు తమ హక్కును వదిలివేయకుంటే భారత్ సిరియాగా మారుతుందని గతంలో రవిశంకర్ వ్యాఖ్యానించారని అసదుద్దీన్ గుర్తు చేశారు.
వివాద పరిష్కారానికి సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటుకు స్వాగతిస్తున్నామని పేర్కొంటూనే రవిశంకర్ కమిటీలో ఉండటంపై అసదుద్దీన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Sri Sri had threatened that India would become like Syria if Ram Mandir isn’t built. He’s asked Muslims to give up their legal claim over title of #BabriMasjid. How would he be a neutral mediator? #AyodhyaMediation pic.twitter.com/vxDdyLEjWT
— Asaduddin Owaisi (@asadowaisi) March 8, 2019